నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్నో హిట్ సినిమాలలో నటించి తన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా ఛాన్స్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబ విషయానికి వస్తే వసుంధరను వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకు బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో బాలకృష్ణ ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారంటూ గుసగుసలు ఉన్నాయి. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరో ? తెలుసుకుందాం.
బాలకృష్ణకు వసుంధర తో వివాహం కాకముందు అప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూను ప్రేమించారట. అయితే ఎన్టీఆర్ కు ఆ విషయం తెలిసి బాలయ్య ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వసుంధరకి ఇచ్చి బలవంతంగా వివాహం చేశారన్నది నిజం. బాలకృష్ణ – వసుంధర వివాహం అయిన తర్వాత కూడా.. ఖుష్బూ – బాలకృష్ణ క్లోజ్ గా ఉండే వారిని వసుంధర ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి బాధపడడంతో.. ఎన్టీఆర్ ఆదేశాలతో హరికృష్ణ ఖుష్బూ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అప్పటినుంచి ఖుష్బూ బాలకృష్ణకు దూరంగా ఉందని వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి.
అయితే తర్వాత బాలకృష్ణ – విజయశాంతి మధ్య కూడా లవ్ ఎఫైర్ నడిచింది అంటూ వార్తలు వినిపించాయి. బాలకృష్ణ – విజయశాంతి కాంబినేషన్లో చాలా హిట్స్ సినిమాలు వచ్చాయి. అప్పట్లో వీళిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండేది. అదే సమయంలో బాలకృష్ణ విజయశాంతి చాలా క్లోజ్ గా ఉండే వారట. బాలకృష్ణ – విజయశాంతిని శాంతి శాంతి అని పిలిచేవాడని.. విజయశాంతి కూడా బాలకృష్ణను నవ్వుతూ సీఎం గారి అబ్బాయి అంటూ ఆటపట్టించేదట. వీరిద్దరూ ఇంత క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరి మధ్యన ప్రేమాయణం నడిచిందనే వార్తలు అప్పట్లో బాగా చక్కర్లు కొట్టాయి.
ఆ తర్వాత సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సీమసింహం, గొప్పింటి అల్లుడు సినిమాలలో తనతో నటించిన సిమ్రాన్ కూడా బాలయ్యను ఇష్టపడేదని.. ఆమె కోసమే బాలయ్య వరుసగా తన సినిమాలతో హీరోయిన్గా రికమెండ్ చేసేవాడని కూడా పుకార్లు వచ్చాయి. అలా ఈ ముగ్గురు హీరోయిన్ల విషయంలో బాలయ్య రూమర్లు ఎదుర్కొన్నాడు.