వచ్చే ఎన్నికల్లో విజయం కోసం.. వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీకి అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా పంపకాలు తప్ప.. అభివృద్ధి లేదనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో టీడీపీ నాయకులు సక్సెస్ అయ్యారు. దీంతో ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.
ఇదే విషయం తాజాగా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న సర్వేల్లో స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ పాలనలో ధరలు పెరిగిపోయాయని.. ప్రతిదీ రెట్టింపు ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని.. మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెబుతున్నారు. ఒకవైపు కొన్ని వర్గాలకు పంపకాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరోవైపు.. ధరలు పెంచేసి అన్ని వర్గాల ప్రజలను బాదేస్తోందని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.
మొత్తంగా ఈ సంకేతాలు బాగానే పనిచేస్తున్నాయని తాజాగా మీడియా సంస్థలు చేస్తున్న సర్వేల్లో స్పష్టం గా తెలుస్తోంది. దీంతో ప్రజలు చంద్రబాబువైపు.. మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోందని అంటున్నా రు. మరోవైపు.. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడాన్ని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఇప్పుడు చేయాలని అన్నా.. చేసే పరిస్థితి లేదు. అసలు విజన్ లేని ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకున్నారు.
దీంతో టీడీపీకి మరిన్ని శుభ శకునాలు వచ్చినట్టేనని అంటున్నారు. ఇదిలావుంటే.. వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యక్తిగత కుటుంబ విషయాల్లోనూ విమర్శలు ఎదుర్కొనడం.. అవికూడా హత్యా రాజకీయాలు కావడం.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇలాంటి విమర్శలు లేకపోవడం.. కేసులు లేకపోవడం వంటివి.. కలిసి వస్తున్నాయని.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకునేందుకు.. ఎంతో ఎడ్జ్ ఉందని అంటున్నారు పరిశీలకులు.