ఎస్ ఇప్పుడు టీడీపీ వర్గాలతో పాటు ఆ జిల్లాలోనూ ఇదే టాపిక్ నడుస్తోంది. పులివెందులలో టీడీపీ గెలుస్తుందా ? లేదా ? అన్నది పక్కన పెట్టేస్తే ఏపీలో టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీటు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డే అంటున్నారు. కనీసం ఇటీవల పులివెందుల నుంచి భూమారెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీగా గెలవడంతో అక్కడ అయినా పార్టీకి కాస్త జవసత్వాలు, ఉత్సాహం కనిపిస్తుందేమో గాని.. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చర్యలతో అక్కడ పార్టీకి ఉన్న ఉత్సాహం పోయి.. కార్యకర్తలకు కొత్తగా నీరసాలు వస్తున్నాయి.
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఏవి ? అని టీడీపీ వాళ్లను ప్రశ్నిస్తే వేళ్ల మీద మాత్రమే లెక్క పెట్టవచ్చని చెపుతూ ఉంటారు. అయితే ఆ లిస్టులో ఖచ్చితంగా ఆళ్లగడ్డ ఉందని టీడీపీ వాళ్లే చెపుతోన్న పరిస్థితి. దీంతో అక్కడ వైసీపీ నుంచి ఎవరు భీ ఫామ్ తెచ్చుకున్నా పెద్దగా కష్టపడకుండానే అసెంబ్లీలోకి అడుగు పెట్టేయవచ్చు.
ఆళ్లగడ్డలో టీడీపీకి మాజీ మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలే ప్రధాన శత్రువు. ఫ్యామిలీలోనూ ఆమె ఒంటరి అయ్యారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్రామ్, తమ్ముడు జగత్విఖ్యాత్రెడ్డి మాత్రమే కలిసి ఉంటున్నారు. ఆమె చెల్లి మౌనిక చాలా రోజులుగా అక్కతో విబేధించి దూరంగా ఉంటున్నారు. ఆమె ఇటీవల సినిమా హీరో మంచు మనోజ్ను పెళ్లి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో బీజేపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి సోదరుడు భూమా కిశోర్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో
జరిగిన సమావేశానికి అఖిలను వ్యతిరేకిస్తోన్న వారు చాలా మంది హాజరయ్యారు. వీరంతా భూమా వారసుడు కిశోర్ అంటున్నారు. మరోవైపు నంద్యాల మాజీ ఎమ్మెల్యే, అఖిల కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డితోనూ ఆమెకు పోసగడం లేదు.
ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో అఖిలకు సీటు ఇస్తే టీడీపీ కేడర్ కాదు.. అసలు భూమా అభిమానులే వాళ్లకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. భూమా కిశోర్ ఇండిపెండెంట్గా పోటీ చేసినా 30 వేలకు పైగా ఓట్లు వస్తాయంటున్నారు. భూమా ఫ్యామిలీ అభిమానుల ఓట్లు అంత బలంగా చీల్చితే ఖచ్చితంగా ఆళ్లగడ్డలో టీడీపీ ఓటమి ఖాయమనే అంటున్నారు.