మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. మన టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్… మహేష్ కెరీర్లోకి ఎంటర్ అయ్యాక మహేష్కు పట్టిందల్లా బంగారం అవుతోంది. గత పదేళ్లలో మహేష్కు కెరీర్ పరంగా వచ్చినన్ని హిట్లు గతంలో ఎప్పుడూ రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే మహేష్బాబు 50 వడిలో ఉన్నా ఇప్పటకీ 30 ఏళ్ల మన్మథుడిలా ఉంటాడు.
మరి వయస్సులో మహేష్ కన్నా నమ్రత యేడాది పెద్ద. అయినా ఇప్పటకీ చాలా స్టైలీష్ లుక్స్ తో హీరోయిన్లకు పోటీ ఇచ్చేందుకు నమ్రత ఆరాట పడుతూనే ఉంటుంది. ఇక మహేష్తో వంశీ సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడి 2005లో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక నమ్రత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్కే పరిమిత మైంది.
ఇక ఆ తర్వాత మహేష్ సినిమా, కెరీర్, బిజినెస్ వ్యవహారాల మీద బాగా ఫోకస్ పెడుతూ మనోడి కెరీర్కు మంచి మెయిన్ పిల్లర్లా మారింది. నమ్రత ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా విదేశీ టూర్లకు వెళ్లిపోతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్యామిలీతో కలిసి నమ్రత ఫారిన్ టూర్లో ఉంది.
ఫ్రాన్స్ రాజధాని ఫ్యారీస్ నుంచి నమ్రత అక్కడి ఫొటోలు షేర్ చేసింది. పింక్ కలర్ క్యాజువల్ సూట్లో నమ్రత చాలా క్లాసిగా కనిపిస్తోంది. చాలా స్టైలీష్ లుక్లో నమ్రత ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై వావ్ నమ్రత ఏం అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి.