మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. కొడాలి నానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? గుడివాడ ప్రజ లు మార్పును కోరుకుంటున్నారా? అంటే.. తాజాగా టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ.. కార్యక్రమానికి వచ్చి న స్పందన చూసి.. ఔననే అంటున్నారు పరిశీలకులు. మార్పు మంచిదే అయినా.. ఈ మార్పును కొందరు నాయకులు.. కొన్ని వర్గాల ప్రజలు కూడా సహించే పరిస్థితి లేదు. కానీ, అనూహ్య కారణాలు.. తీవ్ర అసంతృప్తులు మాత్రం మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇప్పుడు గుడివాడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం.. తాజాగా టీడీపీకి భారీ ఎత్తున ప్రజలు తరలి రావడం గమనిస్తే.. మార్పు తథ్యమనే వాదన బలంగా వినిపి స్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నాని.. గత నాలుగు సార్లుగా విజయం దక్కించుకుంటు న్నారు. అయితే.. ఈ నాలుగు సార్లలోనూ.. అధికారంలో ఉన్నది .. ఇప్పుడు మాత్రమే. గతంలో కాంగ్రెస్లో ఉన్నా.. పెద్దగా చేసింది ఏమీ లేదు.
ఇక, ఇప్పుడు అసలు నిధులు కూడా ఇవ్వడం లేదు. దీంతో నియోజకవర్గంలో పనులు ముందుకు సాగ డం లేదు. రహదారుల నుంచి సాగునీటి సమస్య వరకు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవై పు ప్రజలను ఎమ్మెల్యే గాలికి వదిలేశారనే వాదన ఎలానూ ఉంది. ప్రతిపక్షాలను తిట్టడం వరకే ఆయన పరిమితం అయ్యారని.. ప్రజలు పడుతున్న కష్టాలను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదని.. గుసగుస వినిపిస్తోంది.
కచ్చితంగా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడం.. ఎన్నారై.. వ్యక్తి వెనిగండ్ల రాము.. అన్నీ తానై.. వ్యవహరించడం.. వంటివి చూస్తే.. గుడివాడలో మార్పు ఖాయమని.. టీడీపీ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అంటే.. ఇటు వైసీపీ పరంగాను, అటు ఎమ్మెల్యే పరంగా కూడా.. ఇక్కడ ప్రజలు అసంతృప్తితో ఉన్నారనేది స్పష్టమైపోయిందనే టాక్ స్పష్టంగా తెలుస్తోంది. మరి ఎన్నికల వేళ ఏం జరుగుతుందో చూడాలి.