హైదరాబాద్‌లో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎక‌రాలు: చంద్ర‌బాబు ( వీడియో)

ఏపీలో అధికార వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎక్క‌డ అయినా అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే నమ్మకం ఆశతో ఆ భూములు విలువ పెరుగుతుంద‌ని.. కానీ ఏపీలో ఎవ్వ‌రికి ఆ ఆశ‌లు లేవ‌ని ఆయ‌న చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి హైదరాబాద్‌లో 4 ఎకరాలు కొనే వార‌ని.. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దీనికి కారణం ఎవరో ప్ర‌శ్నించుకోవాల‌ని కూడా ఏపీ జ‌నాల‌కు చంద్రబాబు నాయుడు సూచించారు.