టాలీవుడ్ లోకి కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి ఎంతోమంది యంగ్ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో ఎక్కువ సినిమాలు వస్తుండడంతో పాటు ఇక్కడ మిడిల్ రేంజ్ హీరోలు ఎక్కువగా ఉండడంతో మలయాళం నుంచి వస్తున్న హీరోయిన్లకు ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేఘా ఆకాష్ కూడా నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది.
2017 లో వచ్చిన ఈ సినిమా మంచి సినిమాగా ప్రశంసలు దక్కించుకున్న బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తెలుగులో ఆమె నితిన్ తోనే మరోసారి ఛల్ మోహన్ రంగా సినిమాలో నటించింది. అలాగే పేట సినిమాలో నటించినా ఈ రెండు సినిమాలు హిట్ అవ్వకపోవడంతో మేఘా ఆకాష్ కు పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇటీవల తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా మేఘ ఆకాష్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన అధికార డిఎంకె పార్టీకి చెందిన నాయకుడి కుమారుడుతో మేఘ ఆకాష్ పెళ్లి ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ మీడియా కొడైకుస్తోంది.
వీరిది పెద్దలు కుదిరిచిన ప్రేమ వివాహం అని.. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అయితే మేఘ ఆకాష్ నితిన్తో వరుసగా రెండు సినిమాలు చేసినప్పుడు.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో టాలీవుడ్ లో పుకార్లు వచ్చాయి. అయితే నితిన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఇవన్నీ గాసిప్పులు అని తేలిపోయాయి. ఇక ఇప్పుడు మేఘా ఎట్టకేలకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఇంటికోడలిగా అడుగుపెట్టబోతోంది.