పవిత్ర లోకేష్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకేష్ కర్ణాటకలోని మైసూర్ లో జన్మించింది. తండ్రి లోకేష్ ఆర్టిస్ట్ కాగా.. తల్లి టీచర్. కర్నాటకలో పుట్టి పెరిగిన పవిత్ర అక్కడ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పవిత్ర సీనియర్ నటుడు నరేష్తో ప్రేమలో పడి పెళ్లికి రెడీ అవుతోన్నది తెలిసిందే.
అయితే ఆమె పెళ్లిళ్లు, ఆ భర్తల బ్యాక్గ్రౌండ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు విషయానికి వస్తే 2004లో పవిత్ర లోకేష్ కు హైదరాబాద్కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం జరిగింది. ఏవో మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడిపోయారు. మూడేళ్ల పాటు వీరు కాపురం చేశారట. తర్వాత కర్ణాటక ఇండస్ట్రీలో పవిత్ర సీరియల్ హీరోయిన్ గా నటించే టైంలో ఆ సీరియల్ రైటర్ సుచేంద్రప్రసాద్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ జంట కి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.
సుచేంద్రప్రసాద్ తో మనస్పర్ధలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్న పవిత్ర.. ఆ తరువాత టాలీవుడ్ ఒకప్పటి హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న నరేష్ ను ప్రేమించింది. అలా మొదటి భర్తను సాఫ్ట్వేర్ బ్యాక్ గ్రౌండ్తో.. రెండో భర్త సీరియల్ బ్యాగ్రౌండ్ తో.. వివాహం చేసుకున్న పవిత్ర ప్రస్తుతం సినీ బ్యాక్ గ్రౌండ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్తో లవ్లో ఉంది. ప్రస్తుతం వీరు ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఒకవేళ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే పవిత్ర కు నరేష్ మూడవ భర్త అవుతాడు. కాగా నరేష్ కు ఇది నాలుగో వివాహం. ఇక పవిత్ర – నరేష్ కలిసి ఇటీవల మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఆ సినిమా వీరిద్దరి ప్రేమ కథకు.. వీరిద్దరి జీవితంలో జరిగిన విషయాలకు ప్రతిబింబంగా తెరకెక్కినట్టు వార్తలు వినిపించాయి. ఇటీవల మళ్లీ పెళ్లి సినిమా ఇటీవల రిలీజై సక్సెస్ కాలేదు.