ఏ చిత్ర పరిశ్రమలో ఆయన హీరో, హీరోయిన్లు కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తూ కాస్త చనువుగా ఉంటే చాలు వారీ మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఎన్నో వార్తలు సృష్టిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యుగంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలపై ఇలాంటి వార్తలు ఎన్నో వైరల్ గా మారాయి. వీటితోపాటు గతంలో జరిగిపోయిన పలు ఆసక్తికర విషయాలు కూడా ఇప్పుడు మళ్ళీ బయటికితీస్తూ వాటిని మరింత వైరల్ చేస్తున్నారు.
ఇదే సమయంలో గతంలో చిరంజీవికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త మళ్లీ తెరపైకి రావటం విశేషం.
చిరంజీవి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే అల్లు రామలింగయ్య కూతురు సురేఖని వివాహం చేసుకున్నాడు. ఇలా చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోనే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన జీవితంలో ఎలాంటి కాంట్రవర్సీలు లేవని అందరూ అనుకుంటున్నారు.
కానీ ఆయన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో రూమర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు వాటిలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరంజీవి స్టార్ హీరోగా ఉన్న సమయంలో రాధా, రాధిక, సుమలత, విజయశాంతి వంటి హీరోయిన్లతో ఎక్కువ సినిమాల్లో కలిసి నటించాడు. ఈ సమయంలో చిరు.. సుమలతకు మధ్య ఎఫైర్ నడుస్తుందని.. వీరిద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నరుంటూ అప్పట్లో పలు వార్తలు వైరల్ గా మారయి.
ఈ వార్తలపై అప్పట్లో ఎన్నో గొడవలు కూడా జరిగాయి. ఈ వార్తలపై సుమలత కూడా ఎంతో సీరియస్ గా స్పందించి ఆ వార్తాలో నిజం లేదంటు కొట్టి పడేసింది. అలాంటి ఫేక్ వార్తలు రాసుకోవచ్చిన వారిపై పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇక ఎప్పుడైతే వారిద్దరి మధ్య అలాంటి వార్తలు వచ్చాయే అప్పటి నుంచి ఇద్దరు కలిసి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు.
అలా అప్పటినుంచి చిరు- సుమలత కలిసి నటించ లేదు. ఆ తర్వాత సుమలత కన్నడ రెబల్స్టార్ అంబరీష్ను ప్రేమవివాహం చేసుకున్నారు. సుమలత భర్త అంబరీష్- చిరంజీవి కూడా మంచి స్నేహితుల అన్న విషయం అందరికీ తెలిసిందే. అలా ఈ విధంగా చిరంజీవికి సుమలతతోనే కాకుండా రాధ, రాధిక లాంటి హీరోయిన్లతో ఎఫైర్ నడిచిందంటూ అప్పట్లో వార్తలు ఎన్నో వైరల్ గా మారాయి.