హైద‌రాబాద్‌లో ఫిర్యాదు చేసినా నో రెస్సాన్స్‌.. పామునే ఆఫీసులో వ‌దిలాడు ( వీడియో)

పుర్రెకో బుద్ధి జిహ్వ‌కో రుచి అన్నారు పెద్ద‌లు. తాను ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌ట్లేద‌న్న కోపంతో ఓ యువ‌కుడు ఏకంగా జీహెచ్ఎంసీ ఆఫీసులోనే పాముదు వ‌దిలాడు. అస‌లు విష‌యంలోకి వెళితే హైద‌రాబాద్ న‌గ‌రాన్ని భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. డ్రైనేజ్‌లు అస్స‌లు బాగోలేదు.

దీంతో న‌గ‌రంలో రోడ్ల‌పై పారుతోన్న నీరు వ‌చ్చి ఏకంగా ఇళ్ల‌లో చేరుతోంది. అల్వాల్ ప్రాంతంలో సంపత్ కుమార్ అనే యువకుడి ఇంట్లోకి వరద నీరుతో పాటు పాము కూడా వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన లేదు. ఓపిక నశించి అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చి టేబుల్ మీద పామును పెట్టి త‌న‌ నిరసన తెలిపాడు.