టాలీవుడ్ లో దివంగత ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఓ సంచలనం. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చక్రి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అంచలంచెలుగా ఎదిగారు. స్టార్ హీరోల సినిమాలకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. చక్రి మరణం అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసింది. చక్రి స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని కంబాలపల్లి. 1974 లో జన్మించిన చక్రి స్థానికంగా విద్యాభ్యాసం పూర్తి చేశారు. సంగీతంపై ఆసక్తితో సినిమాలలోకి అడుగుపెట్టారు.
పూరి జగన్నాథ్ ఇచ్చిన ప్రోత్సాహంతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే చక్రి కొత్తగూడెంలో ఓ ప్రోగ్రాం ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో తన భార్య శ్రావణిని చూసి ఇష్టపడి ఆమెకు ప్రపోజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు. 2004లో చక్రి, శ్రావణి పెళ్లి జరిగింది. చక్రి, శ్రావణి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే చిన్న వయస్సులోనే గుండెపోటుతో చక్రి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.
చక్రి మరణాంతరం ఆయన కుటుంబంలో కొన్ని ఆస్తి గొడవలు వినిపించాయి. చక్రి భార్య శ్రావణి తనను చక్రి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని బయటపడింది. ఇక తాజాగా చక్రి తమ్ముడు మెహిత్ నారాయణన్ తన తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అన్నయ్య చక్రి ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు పుట్టుకు వచ్చాయి.
అయితే మాకు అన్నయ్య లేడనే బాధకు తోడు.. ఈ గొడవలతో మరింత ఇబ్బందిగా అనిపించిందని.. ఆ తర్వాత అన్ని సర్దుమనిగాయని మొహిత్ తెలిపారు. ఇక అన్నయ్య ఆస్తులలో కొన్నింటిని ఆయన భార్య శ్రావణి అమ్మేసి అమెరికా వెళ్ళిపోయిందని. అక్కడే మరో పెళ్లి చేసుకుని సెటిల్ అయిందని చెప్పారు. ఇక ఆమెతోనూ మా కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని.. అయితే కొన్ని ఆస్తులకు సంబంధించిన కేసులు ఇంకా కోర్టులోనే పెండింగ్ లో ఉన్నాయని మొహిత్ తెలిపారు.
ఇక మా కుటుంబం ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోందని వస్తున్న వార్తలలో నిజం లేదని.. తమ ఫ్యామిలీ రోడ్డున పడేంత ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని.. అవన్నీ వాస్తవాలు కావని తెలిపారు. ఇక మొహిత్ తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరారీ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఏది ఏమైనా చక్రి భార్య ఏమైంది ? ఎక్కడ ఉన్నది అన్నదానిపై ఇప్పటికీ మొహిత్ ద్వారా ఓ క్లారిటీ వచ్చింది.