వైసీపీ లేడీ ఎమ్మెల్యే సీటు ఖాళీ చేయిస్తోన్న జ‌గ‌న్‌… ల‌బోదిబో…!

క‌ర్నూలు జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌త్తికొండ‌. అస‌లు గెలుస్తుందా? అని అనుకున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగావేసింది. వైసీపీ త‌ర‌ఫున అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించి తొలి అభ్య‌ర్థి కంగాటి శ్రీదేవి. అది కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో ప్ర‌క‌టించిన సీటు. ఇక్క‌డ కేఈ కృష్ణ‌మూర్తి వంటి బ‌ల‌మైన టీడీపీ వ‌ర్గాన్ని ఓడించి పాగా వేసే ఉద్దేశం అప్ప‌టికి వైసీపీకి లేదు. ఏదో ప్ర‌క‌టించేశారు అంతే! అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్ర ఫ‌లించి.. కంగాటి శ్రీదేవి విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఎమ్మెల్యే శ్రీదేవి, పోచం మురళీధర్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ

ఇక‌, శ్రీదేవి విజ‌యం అయితే ద‌క్కించుకున్నారు కానీ.. ప్ర‌జ‌ల మ‌నసులు మాత్రం దోచుకోలేక పోయారు. ఇప్ప‌టికీ కూడా ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య వ‌చ్చిన కేఈ కుంటుంబాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు ఈ కుటుంబానికే చెప్పుకొంటున్నారంటే.. కంగాటి ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. తాజాగా నారా లోకేష్ పాద‌యాత్ర ఇక్క‌డ చేశారు. ఈ సంద‌ర్భంగా కంగాటి కుటుంబం రాజ‌కీయాల‌ను ఆయ‌న పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

అయితే.. దీనికి ఆమె స‌వాళ్లురువ్వారుకానీ.. పార్టీలో ఐక్యంగా ముందుకు వ‌చ్చే నాయ‌కుల‌ను మాత్రం సంపాయించుకోలేక పోయారు. అంటే… వైసీపీ ప‌రంగా కూడా కంగాటిపై వ్య‌తిరేక‌త పెరిగింద‌నే క‌దా! ప్ర‌స్తుతం కంగాటి ప‌రిస్థితి ఎలా ఉందంటే.. ఆమె ఇటీవల గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే.. ఆమెను కొంద‌రు గుర్తించ‌లేక‌పోయారు. `మీరేనా మా ఎమ్మెల్యే` అంటూ.. కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

sridevi as pattikonda ysrcp incharge - Sakshi

ఇది కావాల‌ని అన్న‌మాటో.. వ్యంగ్యాస్త్ర‌మో కాదు.. నిజంగానే వారు మ‌రిచిపోయారు. ఎప్పుడో ఎన్నిక ల‌స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లిన శ్రీదేవి.. సీఎం జ‌గ‌న్ బ‌ల‌వంతం కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని అక్క‌డ నిర్వ‌హించారు. దీంతో ప్ర‌జ‌లు ఆమెను గుర్తించ‌లేక పోయారు. ఇక‌, అల్లుడు అత్త‌గారి పోస్టులో చ‌క్రం తిప్పుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎలానూ ఉన్నాయి. ఇక శ్రీదేవి కొడుకుల పెత్త‌నం కూడా పెరిగిపోయింది.

దీంతో ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోయింది. మ‌రో నేత‌ను ఎద‌గ‌నివ్వ‌రు.. వారు ఎద‌గ‌రు. పార్టీ కార్య‌క్ర‌మాలు కూడా చేయ‌నీయ‌రు.. అనే టాక్ జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చెప్ప‌క‌పోయినా.. కంగాటికి సీటు గ‌ల్లంతేన‌ని మెజారిటీ వైసీపీ నాయ‌కులు అంచ‌నాలు వేస్తున్నారు. ఇదే విష‌యాన్ని వారు చ‌ర్చించుకుంటున్నారు. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌.. కంగాటికి సీటు క‌ష్ట‌మేన‌ని అంటున్న‌వారు.. వైసీపీలో పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp