ఈ సారి ఎన్నికల్లో వైసీపీ కమ్మ వర్గం షాకులు గట్టిగానే తగిలేలా ఉన్నాయి. కమ్మ వర్గం ప్రభావం ఉన్న స్థానాలు..కమ్మ నేతలు ఉన్న స్థానాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కమ్మ వర్గం గాని, నేతలు గాని వైసీపీపై బాగా కసితో ఉన్నారు. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గం, నేతలు టార్గెట్ గా ఎలాంటి కక్ష పూరిత రాజకీయాలు చేశారో తెలిసిందే.
దీంతో కమ్మ వర్గం పూర్తిగా వైసీపీకి వ్యతిరేకమైంది. వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీకి కమ్మ వర్గం దాదాపు 40 శాతం మద్ధతు ఇచ్చింది. వైసీపీ నుంచి కమ్మ నేతలు గెలిచారు..కానీ కమ్మ వర్గాన్ని ఏదో శత్రువు వర్గంగా చూశారు. దీంతో వైసీపీపై కమ్మ వర్గంలో వ్యతిరేకత పెరిగింది. ఇటు టిడిపిలోని కమ్మ నేతలు ఎలాగైనా వైసీపీని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న టిడిపి కమ్మ నేతలు వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఇందులో ముగ్గురు కమ్మ నేతలకు ఎదురులేకుండా పోయింది..ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీ చెక్ పెట్టే కమ్మ నేతలు ఎవరో కాదు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్..గత ఎన్నికల్లో గొట్టిపాటి, ఏలూరి…వైసీపీని తట్టుకుని టిడిపి నుంచి గెలిచారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఇబ్బందులు పెట్టిన తట్టుకుని నిలబడ్డారు..పోరాడుతున్నారు. అందుకే ఆ ఇద్దరి బలం ఏ మాత్రం తగ్గలేదు. అసలు ఆ ఇద్దరికీ ఏ మాత్రం వైసీపీ చెక్ పెట్టలేని పరిస్తితి. ఎంతమంది నేతలని మార్చిన వారిని ఓడించే శక్తి వైసీపీకి లేదు. ఇటు గత ఎన్నికల్లో ఒంగోలులో దామచర్ల ఓడిపోయారు..కానీ ఈ సారి మాత్రం ఆయన ఒంగోలులో టిడిపి జెండా ఎగరవేయడం ఖాయమన్న చర్చలు అయితే నడుస్తున్నాయి.