త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా మరో క్రేజీ దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది దర్శకులు హీరోలు వారి కేరీర్లో ఒక్కసారైనా రామాయణం సినిమాగా చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఎలా అయినా సరే ఈ రామాయణాన్ని మరోసారి సినిమాగా చేయాలని స్టార్ హీరోలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ పేరు కూడా రామాయణం సినిమా విషయంలో వైరల్ అవుతోంది. ఇప్పుడు రామ్ చరణ్ రామాయణం అంటూ ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తాడట. రాముడిగా రామ్ చరణ్, సీతగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
త్రిబుల్ ఆర్ సినిమాలో అగ్గిపిడుగు అ్లలూరి గెటప్లో రామ్చరణ్ నట విశ్వరూపం చూపించాడు. ఇక ఇప్పుడు రామ్చరణ్ రామాయణం చేస్తే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. మరోవైపు సాయి పల్లవి సరైన కథ పడితే ఆమె కూడా నట విశ్వరూపమే చూపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు చెర్రీ రాముడిగా, సాయిపల్లవి సీతగా చేస్తే అది మెస్మరైజ్ ప్రాజెక్టే అవుతుంది.