టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త నిన్న ఒక్కసారిగా చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలోనే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్ 1500కు పైగా సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వారు కూడా ఈయన శిష్యులే.
ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే ఉన్నది ఉన్నట్లు మాట్లాడి రాకేష్ మాస్టర్ ఎన్నో విమర్శల పాలయ్యారు. కానీ ఆయన ఏ విషయంలో తగ్గకుండా ముక్కుసూటిగానే మాట్లాడుతూ ఉంటారు. రాకేష్ మాస్టర్ మరణం వెనక ఎన్నో విషయాలు ప్రస్తుతం మీడియాలో వస్తున్నారు. రాకేష్ మాస్టర్ వారం కిందట కూడా శ్రీకాకుళం వెళ్లి ఓ కొత్త రియాలిటీ షో చేశారు.
ప్రస్తుతం ఎండలు మండేస్తున్నాయి. ఎండలకు ఓర్చుకోలేక రాకేష్ మాస్టర్ తీవ్రంగా మద్యం సేవించారట. ఇప్పటికే విపరీతంగా మద్యం సేవించి రాకేష్ మాస్టర్ ఆరోగ్యం దెబ్బతింది. డాక్టర్లు కూడా బతకడం చాలా కష్టమని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో రాకేష్ మాస్టర్ అభిమానులు ఆయనపై విషప్రయోగం చేశారని ..కావాలనే చంపారని కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
బతికి ఉన్నన్ని రోజులు కూడా హ్యాపీగా ఉండాలంటూ రాకేష్ మాస్టర్ బయట ఏది దొరికితే అది తింటూ డైలీ 20 ఫుల్ బాటిల్స్ వరకు తాగేసేవారట. అలా మితిమీరి మద్యం తాగడం… బయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి రాకేష్ మాస్టర్ చనిపోయినట్టు ప్రాథమిక రిపోర్టులు చెపుతున్నాయి. దీనికి తోడు శ్రీకాకుళం వెళ్లిన ఆయన ఎండలో బాగా తిరగడంతో ఇటు అనారోగ్యం, అటు వడదెబ్బతో చనిపోయినట్టుగా తెలుస్తోంది.