రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల నడుమ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ రాముడు గా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనిపై వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. వాల్మీకి రచించిన రామాయణమే కాదు.. మరో కొత్త రామాయణాన్ని సృష్టించారని చాలామంది మండిపడుతున్నారు. దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించాడు.
మన భారతీయ సంప్రదాయాలు చరిత్రను ఈ సినిమాలో ఒకటి కూడా కనిపించవు. ముఖ్యంగా రావణాసురుడు రూపం అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఏ కోశానా సైఫాలీ ఖాన్ ఇందులో రావణుడిగా కనిపించలేదు.ఇదే సమయంలో ఈ సినిమా విడుదైన తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఈ సినిమాపై భారీ స్థాయిలో నెగెటివిటీ పెరిగింది. మన పక్క దేశమైన నేపాల్ లో ఈ సినిమాపై తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో సీతామాత భారతదేశంలో పుట్టారని చెప్పిన డైలాగ్ ను వారు తప్పుపడుతున్నారు. మన ఇతిహాసాల గ్రంథాల ప్రకారం సీతామాత నేపాల్ లో పుట్టిందని అంటారు. నేపాల్ ప్రజలు కూడా ఆ విశ్వాసంతోనే ఉన్నారు. ఆదిపురుష్ సినిమాలో ఇలాంటి డైలాగ్ పెట్టడంతో వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నేపాల్ లోని ఖాట్మండు సిటీలో భారతీయ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్టు ఆ సిటీ మేయర్ బాలేంద్ర షా అధికారికంగా ప్రకటించారు.
భారతీయ సినిమాలను నేపాల్ లో విడుదల చేయడానికి వీల్లేదని ఆయన ప్రకటించాడు. ఈ ప్రకటనతో భారతీయ సినిమాలకు గట్టి దెబ్బ పడింది. ఆదిపురుష్ సినిమాలో ఆ డైలాగ్ వెంటనే తొలగించాలని వారు కోరారు. సీతమ్మ మా నేపాల్లో పుట్టింది అది మా హక్కు అంటూ వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వారు మరో మూడు రోజులు గడువు ఇవ్యగా ఆ సమయంలోపు ఈ డైలాగ్ తొలగించకపోతే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.