ఆ టాప్ హీరోయిన్ ని టార్గెట్ చేసిన అజిత్.. తమన్నా కోసమేనా..?

సినిమాల విషయయంలో మంచి క్రేజ్ ఫామ్ ఉన్న సినిమాలు తీస్తే సినిమా సక్సెస్ అవుతుందనే ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు నటుడు అజిత్ కూడా ఇదే రూట్ ని ఫాలో అవుతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత‌డు చివరిగా నటించిన చిత్రం ‘ తునివు ‘ విడుదలై దాదాపు సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఆయన తరువాత సినిమా సెట్స్ పైకి రాలేదు. ‘ విడ‌ముయిర్చి ‘ సినిమాలో నటిస్తున్నట్టు అజిత్ ప్రకటించి చాలా కాలమైనా దీనికి మొదటి నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.

మొదట న‌య‌న్ భర్త విగ్నేష్ శివన్ ఈ సినిమాకు డైరెక్టర్ అంటూ వార్తలు వినిపించాయి అలాంటి దశలో సినిమా నుంచి విఘ్నేష్‌ని మూవి టీం తొలగించడం జరిగింది. ఆ విషయంలో అజిత్ ప్రమేయం ఉందనే న్యూస్ వైరల్ అయ్యాయి. వాస్తవానికి ఏమిటన్నది తెలియకపోయినా తర్వాత విడముయ్యిర్చి సినిమా యూనిట్‌లోకి దర్శకుడు మగిల్ తిరివేణి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ సర్వే గంగా పూర్తి చేసుకుంటుందని అందరూ భావించారు.

కానీ మళ్ళీ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందన్న కన్ఫ్యూజన్ అజిత్ అభిమానుల్లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మొదటగా హీరోయిన్ త్రిష అనుకున్నారట త్రిష‌ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడంతో వేరే సినిమాల్లో బిజీ అయింది త్రిష. కాస్త ఆలస్యమైన ఎలాగో విడముయిర్చి సినిమాలో నటిస్తానని త్రిష చెప్పినట్లు సమాచారం. నటుడు అజిత్‌ ఆమెకు అడ్డుపడుతున్నాడట.

తాజాగా సోషల్ మీడియాలో తమన్నా జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా సాంగ్ తో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. దీంతో తమన్నానే సినిమాలో హీరోయిన్గా ఎంచుకోవాలని చూస్తున్నాడట అజిత్. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో త్రిష కూడా తమన్న క్రేజ్‌కి ఏమాత్రం తక్కువ కాదని త్రిషతో ఈ సినిమాను తెరకేకించి హిట్ కొడితే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు హీరోయిని ఎవరు? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.