ఎన్నిక‌ల వేళ‌ మంచు మ‌నోజ్‌కు కీల‌క ప‌ద‌వి.. చంద్ర‌బాబు నిర్ణ‌యం..!

రాజ‌కీయ విశ్లేష‌కులు కొన్నాళ్లుగా చెబుతున్న‌ట్టుగానే ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అటు వైసీపీలోనూ.. ఇటు టీడీపీలోనూ ఒకే రోజు అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రికి టికెట్ ఇవ్వ‌బోమ‌ని .. వైసీపీఅధినేత చెప్పిన‌ట్టు వార్త‌లు రాగా.. ఇటు టీడీపీలోకీల‌క‌మైన డైలాగ్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు కుమారుడు మ‌నోజ్ కుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆయ‌న త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తోక‌లిసి.. హైద‌రాబాద్‌లో టీడీపీఅ ధినేత చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. ఈభేటీకి అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ఎన్నిక‌ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భూమా నాగిరెడ్డి 2వ కుమార్తె మౌనిక‌కు టికెట్ తో పాటు.. త‌న‌కు కూడా టికెట్ ఇవ్వాల‌ని మంచు మ‌నోజ్‌కుమార్ కోరిన‌ట్టు స‌మాచారం. అయి తే.. ఒక కుటుంబానికి రెండు టికెట్ల విష‌యం ప‌రిశీల‌న‌లో ఉంద‌ని.. ప్ర‌స్తుతం సినిమా రంగంలో మంచి ఫాంలో ఉన్నందున‌.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు వ‌ద్ద‌ని మంచు మ‌నోజ్‌కు సూచించిన‌ట్టు స‌మాచారం. అయితే.. పార్టీకి స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు స‌ల‌హా ఇచ్చార‌ని తెలిసింది.

అదే స‌మ‌యంలో మీలో మీరే గొడ‌వ‌లు ప‌డుతున్నారంటూ.. నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యాన్ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించిన‌ట్టు స‌మాచారం. అయితే. ఆ గొడ‌వ‌ల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని మౌనిక తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. త‌న‌కు నంద్యాల టికెట్ ఇస్తే.. ఎంత‌టి ప్ర‌త్య‌ర్థినైనా ఓడించి కానుక‌గా ఇస్తాన‌ని ఆమె ఈ సంద‌ర్భంగా చెప్పిన‌ట్టు తెలిసింది. ఇక‌, మ‌నోజ్‌.. కూడా చంద్ర‌బాబు చేసిన సూచ‌న‌ల‌కు ఓకే చెప్పార‌ని స‌మాచారం.

అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సినీరంగం నుంచి టీడీపీకి స్టార్ క్యాంపెయిన‌ర్‌గా .. మంచు మ‌నోజ్ ప్ర‌చారం చేయ‌నున్నారు. మొత్తానికి ఒక‌టి అనుకుని చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్తే.. రెండు ప‌నులు జ‌ర‌గ‌డం విశేషం. ప్ర‌స్తుతం మ‌నోజ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు బాగానే ఉన్నారు. సో.. ఇది టీడీపీకి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.