టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ బాహుబలి తర్వాత.. బాహుబలికి ముందు అన్నట్టుగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ మానియాను తట్టుకోవడం మహామహా గొప్ప హీరోలకే కష్టంగా ఉంది. బాలీవుడ్ బడా ఖాన్ హీరోలు సైతం ప్రభాస్ దెబ్బకు కుదేలవుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, సాహో ప్లాప్ అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు.
రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. ఆరేడు నెలల గ్యాప్లో ప్రభాస్ నటిస్తోన్న మూడు క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి రానున్నాయి. వీటిల్లో ముందుగా ఈ నెల 16న ఆదిపురుష్ సినిమా వస్తోంది. సెప్టెంబర్లో సలార్, వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రాజెక్ట్ కే సినిమాలు రానున్నాయి.
ఇక ఆదిపురుష్ సినిమా రామాయణంలోని ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్కు మరో 10 రోజుల టైం ఉంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ వద్దవసూళ్ల వేట మొదలు పెట్టేసింది. ఇప్పటి వరకు యూఎస్ల ప్రీ సేల్స్లో 4000 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
అంటే ఇప్పటి వరకు అడ్వాన్స్ సేల్స్ నుంచే 100 కే డాలర్లకు పైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ టైంకు ఆదిపురుష్ వసూళ్ల పరంగా, ప్రీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకోనుంది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.