భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల రోడ్లపై నీరు నిల్వ ఉండిపోతున్నాయి. వాగులు, వరదలు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని కారజణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీటి ప్రవాహాలు రోడ్లపై వేగంగా ప్రవహించడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా పాఠశాలకు సెలవులు మంజూరు చేసింది.
ఇలా భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు వాగుల్లో కొట్టుకుపోయిన సంఘటనలు మరువక ముందే అలాంటి సంఘటన మరొకటి జరిగింది. హనుమకొండ జిల్లాలోని కన్నారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బైక్ తో సహా కొట్టుకుపోయాడు. కన్నారం గ్రామానికి చెందిన మహేందర్ కన్నాపురం వాగుపై వెళ్తుండగా భారీ నీటి ప్రవాహంలోనే బైక్ పోనిచ్చాడు
బైక్ మధ్యలోకి వెళ్లాక అదుపు తప్పింది. ప్రమాదవశాత్తు కన్నాపురం వాగులో పడి కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాలర్ల సహాయంతో గాలిస్తున్నారు. ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కన్నారం వాగులో బైక్ సహా కొట్టుకుపోయిన వ్యక్తి
హనుమకొండ – కన్నారం గ్రామానికి మహేందర్ అనే వ్యక్తి కన్నారం వాగు మీద బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కన్నారం వాగులో పడి కొట్టుకుపోయాడు.
ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు జాలర్ల సహాయంతో గాలిస్తున్నారు. pic.twitter.com/EgWUyCBVrM
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2023