భారత ఉమెన్స్ క్రికెట్ టీంలో స్మృతి మందన ఒక ప్రముఖ క్రీడాకారిణి. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ ఉమెన్. గ్రౌండ్లోకి వచ్చిందంటే ఆపోజిట్ బౌలర్కి చుక్కలే. గ్రౌండ్లో ఉన్నప్పుడు దూకుడు బ్యాటింగ్ చేయడమే కాదు మైదానం బయట కూడా ఈమె అంతే యాక్టివ్గా కనిపించే ఈ తరం అమ్మాయి. భారత్ ఓపెనర్గా ఎన్నో ఇన్నింగ్స్లో చక్కగా ఆడి మెప్పించిన స్మృతి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇటీవల ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల తను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ మచ్చల్తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా తన పుట్టినరోజు జులై 18న ఢాకాలో గ్రాండ్గా జరుపుకుంది. భారత్ టీం బంగ్లాదేశ్ పర్యటనలో ఉండడంతో ఆమె అక్కడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఈ సమయంలో పలాష్ మచ్చల్ కూడా ఢాకా వెళ్లి మరి స్మృతికి బర్త్డే విషెస్ చెప్పాడు. దాంతో ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి.
అవి మరిచిపోక ముందే ఇటీవల పలాష్ మచ్చల్తో సినిమా షూటింగ్ స్పాట్లో స్మృతి మందానా హడావిడి చేసింది. బాలీవుడ్ కమెడియన్, నటుడు రాజుపాల్ యాదవ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మరోసారి తన బాయ్ ఫ్రెండ్ పలాష్ మచ్చల్ తో మెరిసింది. కాగా ఈ సినిమాకు పలాష్ మ్యూజిక్ కంపోజర్ గానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ గా కూడా మారనున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఫోటోలను కమెడియన్ రాజుపాల్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. దీనిలో వీరిద్దరూ కలిసి సందడి చేయడంతో ఒక్కసారిగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు నెలల క్రితం పలాష్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా అతడి తన చేతిపై SM18 అనే పచ్చబొట్టును రాపించుకున్నాడు.
స్మృతి క్రికెట్ జర్నీ నెంబర్ 18 కావడంతో ఆమె పేరుని పచ్చబొట్టు వేయించుకున్నాడని.. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరి డేటింగ్ చేస్తున్నారన్న రూమర్ బాగా పాపులర్ అయింది. కానీ ఈ విషయం వీరిద్దరూ ఇప్పటివరకు బయట పెట్టలేదు. త్వరలోనే వీరిద్దరూ ఈ పుకార్లకు తెరదించుతూ వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టబోతున్నారని తెలుస్తుంది.