ప్రజెంట్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టార్ గా తరికేక్కిన బ్రో సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. కాగా బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన బ్రో పవన్ ఫ్యాన్స్కు ఎలా ఉన్నా సామాన్య ప్రజలకు కామన్ మూవీగానే అనిపిస్తుంది. ఇదివరకు చూసిన అన్ని సినిమాలు లాగానే ఇది కూడా ఉంది ఎక్కడ పెద్దగా వేరియేషన్స్ లేవని చెప్పుకొస్తున్నారు కొంతమంది నెటిజన్స్.
పవన్ కళ్యాణ్ లోని బద్రి సినిమా స్టైల్ కోసమైతే కచ్చితంగా సినిమా చూడవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తెరవెనక కథను మొత్తం నడిపింది త్రివిక్రమే. ఈ సినిమా కి సముద్రఖని మొదటగా కాలపురుషుడు అనే టైటిల్ రాసుకున్నాడట.
సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ కి కూడా ఈ టైటిల్ నచ్చడంతో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందట. కానీ చివరి నిమిషంలో త్రివిక్రమ్ టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్న ఇది పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదు అంటూ టైటిల్ కొట్టి పడేసారట. ఇది ఎమోషనల్ స్టోరి కావడంతో ఇలాంటి సినిమాకి అంత పవర్ ఫుల్ టైటిల్ పెడితే కరెక్ట్ గా అనిపించదని వివరించాడట. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డామేజ్ చేసినట్లు అవుతుంది అందుకే సింపుల్ అండ్ స్టైలిష్ గా క్యాచీ పదాలు వచ్చేలా బ్రో అనే టైటిల్ పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ సజెస్ట్ చేశాడట.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే ఓకే చేశారట. అలా కాలపురుషుడు సినిమా దగ్గర నుంచి బ్రో సినిమా టైటిల్గా మారిపోయింది. మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్ విషయంలో తెలివిగా ఆలోచించాడు. కాలపురుషుడు కన్నా బ్రో టైటిల్ అభిమానులకు కూడా నచ్చడం విశేషం. ఇక దీంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టకుండా మమ్మల్ని బతికించేసావ్ థాంక్స్ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు నెట్టిజన్స్.