ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న దుబాయ్ ఫిలిం క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఓమైర్ సంధు తాజాగా మాస్ మహారాజా రవితేజను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఏం చెప్పినా నిజమని నమ్మే వాళ్ళు ఎప్పుడు అయితే హిట్ సినిమాలను ప్లాప్ అని.. ప్లాప్ సినిమాలకు హిట్టని రేటింగులు ఇవ్వడం మొదలుపెట్టాడో అప్పటినుంచి ఉమైర్ మాటలను ఎవరు నమ్మటం లేదు.
టాలీవుడ్ లో ప్లాప్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని ముందే చెప్పాడు. అలాగే ఆయన సూపర్ హిట్ అవుతాయని చెప్పిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఉమైర్ మాటలను ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోల పర్సనల్ విషయాలను కూడా టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేయగా.. ఇప్పుడు రవితేజను టార్గెట్ చేశాడు.
రవితేజ స్వతహాగా తన పని తాను చేసుకునే మనిషి. ఎప్పుడూ విభేదాలకు దూరంగా ఉంటాడు. అయితే ఒక్క డ్రగ్స్ ఇష్యూలో మాత్రం రవితేజ పేరు బయటకు వచ్చింది. తాజాగా ఉమైర్ సంధు రవితేజతో పని చేయడానికి చాలామంది యంగ్ హీరోయిన్లు.. ఐటెం గర్ల్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారని ఆరోపించాడు. షూటింగ్ సమయంలో రవితేజ వారిని టచ్ చేసే విధానం చాలా ఇబ్బందిగా ఉంటుందట.
రవితేజ చాలామంది కొత్త నటీమణులను బాగా ఇబ్బంది పెట్టాడని సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఉమైర్ నిజంగానే ఆరోపణలు చేశారా ? లేదా తాను హైలైట్ అయ్యేందుకు రవితేజను టార్గెట్ చేశాడా అన్నది క్లారిటీ లేదు. కానీ ఇటీవల ఉమైర్ మాత్రం ఇష్టం వచ్చినట్టు స్టార్ హీరోల మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.