ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. కృష్ణంరాజు నటవారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో రు. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ప్రభాస్ పేరు వినిపిస్తుంది. దీంతోపాటే అధిక పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టిన రికార్డ్ కూడా ప్రభాస్కే దక్కింది.
బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్ అయినా కోట్లలో కలెక్షన్లు తెచ్చిపెట్టాయి. దీన్నిబట్టి పాన్ ఇండిమా లెవల్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ? ఉందో చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రైలర్కు ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో… ప్రభాస్ నటించిన మొదటి చారిత్రక సినిమా ఆది పురుష్పై ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆశలు, అంచనాలు మరింత పెరిగాయి.
మిర్చి సినిమా దగ్గరనుంచి తన ప్రతీ సినిమాలో యువీ క్రియేషన్స్ వారిని ఇన్వాల్వ్ చేస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం యువి క్రియేషన్స్ ను కాస్త దూరం పెడుతున్నట్టు గుసగుసలు వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా ఏపీ, నైజాం హక్కులను యూవీ క్రియేషన్స్ రు. 100 కోట్లకు దక్కించుకుందని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు వారిని తప్పించి ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ రు. 170 కోట్లకు అప్పగించాడంటున్నారు.
ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో కూడా యూవీ క్రియేషన్స్ వారిని పక్కన పెట్టి… ఆ ప్లేస్ లో పీపుల్స్ మీడియా బ్యానర్ను తీసుకువచ్చారంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ లోనే మారుతితో సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీ కూడా పీఫుల్స్ మీడియా బ్యానర్లోనే ఉంది. తాజాగా యూవీ వాళ్ల నుంచి మరో చిన్న బ్యానర్ కూడా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కారణాలే యూవీ క్రియేషన్స్, ప్రభాస్ మధ్య గ్యాప్ రావడానికి కారణం అంటున్నారు. ప్రస్తుతానికి యూవీ – ప్రభాస్ కాంబోలో సినిమా ఉండే ఛాన్సులు లేవంటున్నారు.