ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన వారిని మోసం చేసి తప్పించుకోవడం చాలా సహజం. సమయస్ఫూర్తితో ఇండస్ట్రీలో అడుగులు వేయకపోతే వారి జీవితం నాశనం అయిపోయినట్టే. ఆడవారిని శారీరకపరంగాను, మగవారిని డబ్బు పరంగాను వాడుకొని వదిలేసేవారు చాలామంది ఉంటారు. ఇదే విధంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లి కూడా ఇండస్ట్రీకి వచ్చి మోసపోయి ఆత్మహత్య చేసుకుంది.
అప్పట్లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సిమ్రాన్ తెలుగు, తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. బాలయ్యకు అయితే సిమ్రాన్ బాగా లక్కీ హీరోయిన్. ఇక అక్క స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే ఆమె చెల్లి రాధా మోనాల్ కూడా అక్కని చూసి ఇండస్ట్రీ పైన ఎన్నో ఆశలతో అడుగు పెట్టింది. ఈమె సిమ్రాన్ చెల్లిగా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా పేరు తెచ్చుకుంది.
హిందీ, తమిళ్ అలాగే తెలుగులో సినిమాలను చేసింది. ఇష్టం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఆమె పరిచయమైంది. అటువంటి రాధామోనల్ తమిళ్ ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. అతడు రాధా మోనాలను వాడుకొని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఆమె చనిపోయిన మొదటి రోజుల్లో అనారోగ్యం వల్ల ఉరి వేసుకుని చనిపోయిందని వార్తలు వినిపించాయి.
అయితే ఆ తర్వాత ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ చేతిలో మోసపోయి చనిపోయిందని నిజం బయటకు వచ్చింది. ఆమెను మోసం చేసింది కొరియోగ్రాఫర్ సుజిత్ అనే టాక్ వచ్చింది. అయినా ఈ విషయంపై ఆయన ఇప్పటికీ రియాక్ట్ అవలేదు. ఆమె చనిపోయేటప్పటికి గర్భవతిగా ఉందని కూడా వార్తలు వినిపించాయి.