నేను నీకు ఏమన్నా ఆంటీనా..? బాలయ్య సినిమానే రిజెక్ట్ చేసిన హీరోయిన్..!

ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఎంతో హాట్‌ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో ఇటీవ‌ల కాలంలో స్టార్ హీరోయిన్లు కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలకు కూడా నో చెబుతున్నారు. మన పాత రోజుల్లో పద్ధతి ఇలా ఉండేది కాదు.. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇస్తామంటే వెంట‌నే ఆ సినిమాకు డేట్స్ ఇచ్చేసేవారు. వారు నటిస్తున్న సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసి మరి ఆ హీరో సినిమాలో నటించేవారు. ఇక ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారిపోయింది.

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న బాలయ్య సినిమాను సైతం ఓ సెకండ్ గ్రేడ్‌ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట‌. నటసింహం నుంచి గ్లోబల్ ల‌య‌న్‌గా మారిన బాలయ్య ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డితో మరో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తన 108వ సినిమా భగవంత్‌ కేసరిని స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇక ఈ సినిమాల్లో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా..ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. వచ్చే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ – హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. హానీ రోజ్‌ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ మీరాజాస్మిన్ అట‌.

ఇక దర్శకుడు గోపీచంద్ కూడా ఈ సినిమా కథను ఆమెకు చెప్పగా ఆమె నచ్చలేదంటూ రిజెక్ట్ చేసిందట. అంతేకాకుండా నాతో ఆంటీ క్యారెక్టర్ చేయిస్తారా అంటూ మండిపడిందట. ఇక దీంతో దర్శకుడు గోపీచంద్ అక్కడికక్కడే మీరాజాస్మిన్ పేరుని మర్చిపోయి హనీ రోజ్‌ను ఈ సినిమాలో తీసుకున్నాడ‌ట‌. తర్వాత సినిమా విడుదలయ్యాక హనీ రోజ్‌ పేరు టాలీవుడ్ లో ఎలా మారుపోగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాలా..? గ‌తంలో బాల‌య్య‌కు జోడీగా మ‌హార‌థి సినిమాలో న‌టించిన మీరాజాస్మిన్ ఇప్పుడు మ‌రో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది.