టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్లోనే స్టార్ హీరోగా ఎదిగి సూపర్ స్టార్ గా ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. మహేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక మహేష్ ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలు ఆదాన్ని సంపాదిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తన గ్యారేజ్ లోకి మరో రేంజ్ రోవర్ కార్ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
మహేష్ తాను నటించే ఒక్కో సినిమాకి రూ.70 – 80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అంతేకాకుండా ఎన్నో రకాల యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్న స్టార్ హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. మహేష్కు ఖరీదైన కార్లు అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆయన గ్యారేజీలో ఎన్నో కార్లు ఉన్నాయి. ఇదే గ్యారేజ్లోకి గోల్డెన్ కలర్ రేంజ్ రోవర్ కార్ చేరింది.
ఇప్పుడు ఈ కారు ధర తెలిసి అందరూ నోరెళ్లపెడుతున్నారు. దాదాపు ఈ కారు ధర రూ.5.4కోట్ల ఉన్నట్లు తెలుస్తుంది. రేంజ్ రోవర్ కారు కళ్ళు చెదిరే లుక్కుతో అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ కార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ లాల్ ,సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు సైతం ఈ రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. వీటిలో రేంజ్ రోవర్ ఎస్ వి ఏంతో సూపర్ గా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ హైదరాబాదులోకి రావడంతో మహేష్ బాబు ఈ కార్ను కొన్నట్టు తెలుస్తోంది.
ఇండియాలో మాంచి లగ్జరీగా ఫీల్ అవుతున్న కార్లలో ఇది కూడా ఒకటి. ఇప్పటికే ఈ కారును హైదరాబాద్ రోడ్లపై తిరిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.