మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. సాయితేజ్కు బైక్ యాక్సిడెంట్ అయ్యాక చేసిన సినిమా ఇది. దీంతో ఈ సినిమా కోసం ప్రమోషన్లలో బాగా కష్టపడ్డాడు. సినిమా మీద మంచి ఆసక్తి కూడా నెలకొంది. రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెఫ్ట్తో సాయి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండును దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై భోగవల్లి బాపినీడు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. సంయుక్త మీనన్ హీరోయిన్. ఇక సినిమా చూసిన వారందరూ కూడా అదిరిపోయిందని.. సాయి కెరీర్లో మంచి బ్లాక్బస్టర్ అవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
విరూపాక్ష థ్రిల్లర్ సినిమా అంటున్నారు. స్టోరీ లైన్ చాలా ఇంట్రస్టింగ్గా ఉందంటూనే.. ట్విస్టులు కూడా అదిరిపోయాయంటున్నారు. లవ్ ట్రాక్ బాగోలేదని.. బోర్ కొట్టించిందనే ఎక్కువ మంది అంటున్నారు. కొన్ని చోట్ల రజనీకాంత్ చంద్రముఖిని తలపించే సీన్లు కూడా పెట్టారంటున్నారు. విరూపాక్ష ట్విస్టులు, సినిమా కథ టర్న్లు ఆ రేంజ్లో ఉన్నాయంటున్నారు.
సుకుమార్ స్క్రీన్ ప్లే హైలెట్ అంటున్నారు. ఈ సినిమా స్టోరీ 1980-90వ దశకంలో రుద్రవరం అనే విలేజ్లో జరిగినట్టు చూపించారు. విక్రాంత్ రోణకు అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చిన అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయిందంటున్నారు. రుద్రవనం మిస్టరీని ఛేదించే సూర్య అనే యువకుడిగా సాయిధరమ్తేజ్ యాక్టింగ్ బాగుంది.
ఫస్ట్ హాఫ్లో కామెడీ టైమింగ్తో ఆకట్టుకోగా, సెకండాఫ్లో సీరియస్ రోల్లో చక్కటి వేరియేషన్ చూపించాడు. ఇక నందినిగా హీరోయిన్ సంయుక్త మీనన్ యాక్టింగ్కు స్కోప్ ఉన్న రోల్లో కనిపించింది. ఫస్టాఫ్లోనే థ్రిల్ మూమెంట్స్ ఉన్నా… ఆ టెంపో పూర్తిగా కొనసాగించలేదంటున్నారు. ఊరిలో జరిగే హత్యల వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో ఒక్కో చిక్కుముడిని రివీల్ చేయడంతో పాటు సెకండాఫ్ను చాలా ఎంగేజింగ్గా తెరకెక్కించాడట.
ఇక ట్విస్టులతో డైరెక్టర్ కథను బాగా రాసుకున్నాడనే టాక్ వచ్చింది. కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నా…. సుకుమార్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ను ఈ సినిమా చివరి వరకు థ్రిల్కు లోను చేయించిందని.. సాయితేజ్కు మంచి కం బ్యాక్ హిట్ అని డిసైడ్ చేసేస్తున్నారు.