ఉప్పెన సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే భారీ బంపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. అదే సమయంలో ఆ విజయాల దగ్గర్నుంచి కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతూ వచ్చాయి. ఏకంగా కృతిశెట్టి ఆరు ప్లాప్లను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సమయంలో కృతికి అవకాశాలు రావటం కష్టమే అనుకున్నారు . కానీ కృతి శెట్టి కి ఎన్ని ప్లాప్లు వచ్చినా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఐరన్ లెగ్ ముద్దుగుమ్మకు ఓ సౌత్ ఇండియన్ బ్లాక్ హీరో ఇష్టపడి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చారట. ఇప్పటికే కృతి శెట్టి తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్ లో ఓ చాన్స్ కొట్టేసింది.
ఇప్పటికే సూర్య 41వ సినిమాలో ముందుగా కృత్తి శెట్టిని హీరోయిన్గా అనుకున్నారు. అంతేకాకుండా సూర్య తమ్ముడు కార్తీ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా అనుకొని చివరలో వేరే అమ్మాయిని తీసుకున్నారు.. కానీ ఇప్పుడు కోలీవుడ్ బ్లాక్ స్టార్ విశాల్ మాత్రం కృతి శెట్టికి ఆఫర్ ఇచ్చారట.
విశాల్ హీరోగా పాండ్య రాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. విశాల్ సినిమా అంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ విధంగా కృతి శెట్టి తెలుగులో అవకాశాలు రాకపోయినా కోలీవుడ్లో తన మొదటి సినిమా అవకాశాన్ని తెచ్చుకుంది. ఈ సినిమాతో అయినా ఈ ముద్దుగుమ్మ సక్సెస్ ట్రాక్లోకి వస్తుందో లేదో చూడాలి..?