నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని టిడిపి కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని చూస్తుంది. ఈ క్రమంలో టిడిపి పదునైన వ్యూహాలతో ముందుకెళుతుంది. పొత్తుల దిశగా కూడా వెళుతున్న విషయం తెలిసిందే. జనసేనతో టిడిపి పొత్తు ఖాయమనే చెప్పవచ్చు. పొత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో…వైసీపీకి గడ్డు పరిస్తితులు తప్పవని తెలుస్తుంది.
టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా టిడిపి-జనసేన..గెలవడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ కేవలం 8 జిల్లాల్లోనే సాధించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఆ జిల్లాల్లోనే టిడిపి 88 మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని, జనసేన సపోర్ట్ తో సత్తా చాటడం ఖాయమని అంటున్నారు. అలా టిడిపి మ్యాజిక్ ఫిగర్ దాటించే జిల్లాలు శ్రీకాకుళం-ప్రకాశం జిల్లాలు.
మొదట ఉత్తరాంధ్ర తీసుకుంటే..అక్కడ మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం. ఒక విశాఖలో జనసేన ప్రభావం కాస్త ఉంది. అయినా ఉత్తరాంధ్రలో టిడిపికి ఆధిక్యం ఉంది. అక్కడ 34 సీట్లు ఉన్నాయి…అందులో టిడిపి-జనసేన కలిసి 25 సీట్లు గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు..ఈ జిల్లాల్లో కూడా 34 సీట్లు ఉన్నాయి.
ఇక్కడ టిడిపి-జనసేన పొత్తు ప్రభావం ఎక్కువ..రెండు పార్టీలు కలిసి..25-28 సీట్లు వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక కృష్ణ-గుంటూరు-ప్రకాశం..ఈ మూడు జిల్లాలు కలిపి 45 సీట్లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 30 పైనే సీట్లు టిడిపి-జనసేన గెలుచుకుంటాయని అంటున్నారు. దీంతో గెలవడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లు 88..ఈ జిల్లాల్లోనే వచ్చేస్తాయని లెక్కలు వేస్తున్నారు. చూడాలి మరి టిడిపి-జనసేన పొత్తు ఏ మేర సత్తా చాటుతుందో.