ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో వైసిపి అధిష్టానం అనుమానించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన తర్వాత ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తమతో ఈ నలుగురు మాత్రమే కాదని 40 నుంచి 50 మంది వరకు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. వారంతా పార్టీ కండువాలు మార్చేందుకు సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇప్పుడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది దేశ చరిత్రలోనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని.. ఫిక్షన్ కథలు రాసేవారు కూడా ఇలాంటివి రాయలేరని చంద్రబాబు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి ప్రజలు అదిరిపోయే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శాశ్వత చికిత్స చేస్తారని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.
టిడిపిలో.. ఆ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతామంటూ చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఇప్పుడు బయటకు వచ్చేయడంతో వైసిపి నేతల్లో.. వాళ్ల మధ్య వాళ్లకి కొత్త సందేహాలు అయితే రేకెత్తుతున్నాయి.