రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని శోక సముద్రంలో ముంచేసిన ఈ వార్త నుంచి తేరుకోవడానికి కొంతం సమయం పడుతుందని చెప్పొచ్చు. కృష్ణం రాజు (Krishnam Raju ) మరణానికి ముఖ్య కారణం పోస్ట్ కోవిడ్ వల్ల వచ్చిన సమస్యలే అని అంటున్నారు. ఏ.ఐ.జి డాక్టర్స్ కూడా కృష్ణం రాజు మృతి పట్ల బులిటెన్ రిలీజ్ చేశారు.
పోస్ట్ కొవిడ్ వల్ల అనారోగ్య పాలైన కృష్ణం రాజు (Krishnam Raju ) కొన్నాళ్లుగా ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. అయితే హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన మరణించినట్టు హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ స్టార్ గా ఎదగడంలో కృష్ణం రాజు పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ తో కలిసి రెబల్, రాధే శ్యాం సినిమాల్లో నటించారు కృష్ణం రాజు.
కృష్ణం రాజు చివరి సినిమా రాధే శ్యాం. ప్రభాస్ తో ఒక్క అడుగు సినిమా చేయాలని అనుకున్నారు కృష్ణం రాజు. ఆయన లేని లోటు ప్రభాస్ కి ఎవరు తీర్చలేరని చెప్పొచ్చు. సినీ ప్రముఖులంతా ప్రభాస్ ఫ్యామిలీకి తమ సానుభూతి తెలియచేస్తున్నారు.