సినిమా ఇండస్ట్రీలో నరేష్ – పవిత్రా లోకేష్ గురించి తెలియని వాళ్లు ఉండరు అని చెప్పటం అతియోశక్తి కాదు. ఎందుకంటే ? గత ఐదారు నెలలుగా ఈ జంట తెలుగు మీడియాలను.. తెలుగు సోషల్ మీడియాలను ఎంత హాట్ టాపిక్ గా మారిందో చూసాం. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ సహజ జీవనం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పవిత్ర అటు తను రెండో భర్త సుచేంద్ర ప్రసాద్ కు.. ఇటు నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇక నరేష్ కూడా తాను త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నానని.. తమ బంధాన్ని అధికారికంగా చేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. ఇక తాజాగా ఈ ఇద్దరి జీవితం గురించి మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా తెరకెక్కింది. ఈ సినిమాకు నరేష్ స్వయంగా నిర్మాత కాగా.. సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. అయితే మళ్ళీ పెళ్లి సినిమా చూసిన ఓ నెటిజన్ నరేష్ – పవిత్రలను పచ్చి బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.
ఇన్ని సంవత్సరాలు కాపురం చేసుకున్న వారికి మధ్యలో ఎవత్తో జిగేలురాణి రావటం చాలా తప్పు.. తెలుగు చాంబర్లో చాలా తప్పులు జరుగుతున్నాయని నువ్వు చెప్తున్నావు… సినిమాలో 100 తప్పులు చేశావు నా పెళ్ళాం అట్లాంటిది ఎట్లాంటిది అని చెప్పావు.. ఆ విషయం నీకు 20 సంవత్సరాల తర్వాత తెలిసిందా ? నీ పెళ్ళాం ఇలాంటిది అనడం తప్పు కాదు.. కానీ అందరికీ తెలిసేలా సినిమా తీసి అది అలాంటిది ఇలాంటిది అని భార్య గురించి మాట్లాడేలా చేయడం చాలా పెద్ద తప్పు అని పచ్చి బూతులు తిట్టాడు. ఇవి నిజంగా నరేష్, పవిత్ర వింటే చెవులు చిల్లులు పడాల్సిందే అన్నట్టుగా ఉన్నాయి.
అంతేకాకుండా వాడో లత్కోర్ గాడు.. అదో జిగేల్ రాణి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా నరేష్ – పవిత్ర తమకు నచ్చని భాగస్వాములతో విడిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకుని సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టడం తప్పు కాదు.. అయితే విమర్శలకు తావు లేకుండా తమ తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకుని వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటే ఈ విమర్శలకు పుల్ స్టాప్ పడనుంది. ఏది ఏమైనా నరేష్, పవిత్ర పెళ్లి జరిగే వరకు ఈ విమర్శలు ఆగేలా లేవు.