సాధారణంగా చాలామంది స్టార్స్ డబ్బులు ఇస్తే ఎలాంటి పాత్రలో చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. అలాగే కొంతమంది స్టార్ హీరోయిన్లు చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో విన్నప్పుడు చాలామంది నెటిజన్లు డబ్బు కోసం స్టార్స్ ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి న్యూస్ తమన్నాపై వైరల్ అవుతుంది. తమన్నా ఒక డబ్బు మనిషి అని.. డబ్బు కోసం మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందంటూ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.
అసలు విషయానికి వస్తే తమన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది. ఈ సాంగ్స్ అన్నీ ఆడియన్స్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే ఆమెతో సీనియర్ స్టార్ హీరో బాలయ్య ఎన్.బి.కె 108 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ప్లాన్ చేశారు. ఇందేకు తమ్మన్నాను అడగగా ఆమె స్పెషల్ సాంగ్ చేయడానికి ఏకంగా రు. 1.5 ఐదు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
ఫెడ్ అవుట్ అవుతున్న సమయంలో ఒక హీరోయిన్ ఇంత రెమ్యూనరేషన్ అడగడంతో మేకర్లు కూడా షాక్ అయ్యారట. ఈ క్రమంలోనే తమన్నాకి బదులుగా సిల్వర్ స్క్రీన్ టాప్ యాంకర్ అనసూయను స్పెషల్ సాంగ్ కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అనసూయ పలు స్పెషల్ సాంగ్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
దాంతో పాటే ప్రస్తుతం అనసూయకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి అనసూయనే ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ బయటకు రావడంతో నందమూరి ఫ్యాన్స్ తో పాటు చాలామంది నెటిజన్లు తమన్నాపై ఫైర్ అవుతున్నారు. డబ్బు కోసం తమన్నా ఎంత చెత్త పని అయినా చేస్తుందంటూ ఏకిపడేస్తున్నారు.