ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా స్టార్ ముద్దుగుమ్మలు ఎప్పుడు ప్రేమలో పడుతున్నారో ..ఎప్పుడు బ్రేకప్ చెప్పేసుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు . అంతలోనే ప్రేమలో పడ్డాం అంటూ ప్రకటిస్తున్న హీరోయిన్స్ .. కొన్నాళ్లకే బ్రేకప్ అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చేస్తున్నారు . ఈ క్రమంలోని స్టార్ హీరోయిన్స్ జీవితాలలో జరిగే విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. కాగా అలాంటిఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . ఇండస్ట్రీలో బడాబడా ఆఫర్స్ పట్టేస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతుంది. మరి ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ పై బాలీవుడ్ మీడియాలో ఎలాంటి క్రేజీ న్యూస్ లు వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
ఇలాంటి క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ నటుడు- ప్రొడ్యూసర్- బిజినెస్ మెన్ అయిన జాకీభగ్నానితో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ విషయాన్ని ఓపెన్ గా అనౌన్స్ చేసింది రకుల్ . అయితే ఈ జంట త్వరలోనే విడిపోబోతున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది. దానికి రీజన్ లేకపోనూ లేదు . రకుల్ ప్రీత్ సింగ్ మరో డబ్బున్న బిజినెస్ మాన్ ను పట్టుకుందని ..ఈ క్రమంలోనే జాకీ ని దూరంగా ఉంచుతుందని ఓ న్యుస్ వైరల్ అవుతుంది.
అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మారాలి అంటే ఇలాంటి ప్రేమాయణాలు నడుపుతూ ఉంటే కుదరదు అని భావించిన రకుల్ అతని దూరం పెడుతూ మరో కొత్త క్యాండిడేట్ ను బుట్టలో పడేసుకుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై కొంతమంది స్పందిస్తూ.. జాకీ పై మోజు తీరిపోయిందా..? లేక నీ మూడు మారిపోయిందా ..? అంటూ వల్గర్గా ట్రోల్ చేస్తున్నారు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ బ్రేకప్ మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!