SSMB28 పాన్ ఇండియా స్కెచ్.. డేట్ చెప్పి మరి వస్తున్నారుగా..!

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ SSMB28 త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి మహేష్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. హారిక హాసిని క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని 2023 ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పోకిరి సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. మళ్లీ అదే డేట్ కి SSMB28 సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అంతేకాదు ఎపిక్ బ్లాస్ట్ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చ్స్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగు ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమాతో నేషనల్ లెవల్ లో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.

దానికి ముందే త్రివిక్రం సినిమాతో హిందీ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు మహేష్. ఎలాగు మన తెలుగు సినిమాలకు అక్కడ మార్కెట్ బాగానే ఉంది కాబట్టి మహేష్ సినిమాకి అక్కడ మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి మహేష్ 28వ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Tags: mahesh, Pooja Hegde, SSMB28, Tollywood, trivikram