టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన నాని ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ హీరోగా మారాడు . అష్టాచమ్మా అనే సినిమా సినిమాతో నాని మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ లో ఉండే బడా హీరోలకి కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు నాని .
ఒకానోక టైంలో వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ.. స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు లేదా బెదిరించి అయినా సరే నానితో తన సినిమాను పోస్ట్ పోన్ చేయించుకునే వారు..అన్న న్యూస్ లు వైరల్ అయ్యాయి. కాగా ప్రజెంట్ శ్రీకాంత్ ఓదేలా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దసరా. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు మేకర్స్.
అయితే ఎక్కడ చూసినా నాచురల్ స్టార్ నాని సింగిల్గానే కనిపిస్తున్నాడు ..తప్పిస్తే డైరెక్టర్ గాని.. హీరోయిన్ కీర్తి సురేష్ కానీ ఎక్కడ కనిపించడం లేదు . ఈ క్రమంలోనే జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . నాని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు.. కనీసం ఆయనతో నటించిన హీరోయిన్ అయినా ఈ సినిమాను ప్రమోట్ చేయొచ్చుగా అంటూ ఫైర్ అయ్యారు . ఈ క్రమంలోనే అసలు విషయం బయటపడింది. ప్రజెంట్ కీర్తి సురేష్ పలు కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది .
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ కాలేను అంటూ డైరెక్టర్ కు చెప్పేసిందట. అంతేకాదు డైరెక్టర్ కూడా విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కోసం విదేశాలలో ఉన్నట్టు తెలుస్తుంది . ఈ క్రమంలోనే జూమ్ మీటింగ్ ద్వారా సినిమా ప్రమోషన్స్ ను ఫాలో అప్ చేస్తున్నారని ..వన్స్ అది కంప్లీట్ అవ్వగానే కీర్తి సురేష్ డైరెక్టర్ , కూడా నానితోపాటు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారని నాని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈలోపే కొందరు కావాలని నాని సినిమాను డిగ్రేట్ చేస్తున్నారు . నాని ఫేస్ కి అంత సీన్ లేదని ..కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ కూడా హ్యాండ్ ఇచ్చిందని ..ఇక దేవుడే దిక్కు అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు..!!