తెలుగు సినీ తెరపై తళుక్కున మెరిసిన తారల్లో.. కొందరు చరిత్రను క్రియేట్ చేస్తే.. మరికొందరు మాత్రం.. కేవలం కొన్నాళ్లకే పరిమితం అయ్యారు. చరిత్రను క్రియేట్ చేసిన అతి కొద్ది మందిలో కుటుంబ కథలకు ప్రాణం పోసిన.. హీరోయిన్.. శోభన. మోహన్బాబు హీరోగా వచ్చిన రౌడీగారి పెళ్లం, చిరంజీవి హీరోగా నటిం చిన రుద్రవీణ, విక్రమ్, అల్లుడుగారు.. వంటి పలు చిత్రాల్లో నటించింది.
పాత్రలో లీనమై నటించిన తెలుగేతర హీరోయిన్గా శోభన మంచి పేరు సంపాయించుకుంది. కేరళకు చెందిన శోభన.. వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె ఇప్పటికీ వివాహం చేసుకోకుండా.. ఉండిపోయింది. దీనికి కారణం.. సినిమాల్లో ఒకరిని ప్రేమించడంతోనో.. లేక ప్రేమలో విఫలం కావడం వల్లో కాదు.. తన జీవితాశ యం అయిన.. భరత నాట్యం, కథక్ వంటి నృత్యాలను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశమట.
అందుకే కేరళలోని తిరువనంతపురంలో మ్యూజిక్ కాలేజీని ఏర్పాటు చేసి.. యువతకు డ్యాన్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక, అడపా దడపా మాత్రమే సినిమాల్లో నటిస్తున్న శోభనకు తెలుగులో మంచి పేరు ఉండ డం గమనార్హం. అసభ్య సన్నివేశాలకు.. అశ్లీల సంభాషణలకు పూర్తి విరుద్ధమైన శోభన తాను నటించిన ప్రతి సినిమాలోనూ.. ఈ జాగ్రత్తలు తీసుకునేవారు. ఎక్కడా.. సంప్రదాయానికి భిన్నంగా నటించేది కాదు.
అంతేకాదు.. తన సినిమాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా.. సంప్రదాయ నృత్యానికి శోభన ప్రాధాన్యం ఇచ్చేద ని దర్శకులు చెప్పేవారు. పనిగట్టుకుని నృత్యం ఉండే సీన్లు చేసేదని చెప్పేవారు. దాదాపు 12 భాషల్లో నిపుణురాలైన శోభన.. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ అవార్డు అందుకున్న నేటి తరం హీరోయిన్ కావడం గమనార్హం.