బాలీవుడ్ లో ఒకప్పటి అందాల కథా నాయక, మాజీ మిస్ ఇండియా సెలీనా జెట్లీ తన మనసులో మాట చెప్పే విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గరు. ఈ సీనియర్ నటి అప్పట్లో అందాలు ఆరబోసే విషయంలో ఏమాత్రం భయపడే వారే కాదు. సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిన సెలీనా జెట్లీపై ఇప్పుడు బాలీవుడ్ క్రిటిక్గా చెప్పుకునే ఉమైర్ సంధు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సెలీనా జెట్లీ బాలీవుడ్ లో తండ్రి కొడుకులతో పక్కపంచుకుందంటూ ఉమైర్ వ్యాఖ్యలు చేయడంతో సెలీనా ఉమెర్ను తీవ్రంగా హెచ్చరించడంతోపాటు పరువు నష్టం ఫైల్ చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఆ హీరోతో పాటు అతడి తండ్రి నిర్మాత కావడంతో ఇద్దరితోనూ పడుకుందని ఉమైర్ వ్యాఖ్యానించాడు. సెలీనా జెట్లీ గతంలో ఫిరోజ్ ఖాన్ నటించిన జాన్షీన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఇందులో ఫిరోజ్ ఖాన్ వారసుడు ఫర్దీన్ ఖాన్ హీరోగా నటించాడు.
ఆ తర్వాత సెలీనా 2005లో సల్మాన్ ఖాన్ నటించిన నో ఎంట్రీ సినిమాలోని ఫర్దీన్ ఖాన్కు జోడిగా నటించింది. ఇలా వరుసగా అతనితో నటించడంతో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆమె ఇప్పటికే సినిమాలకు దూరమై చాలా ఏళ్లు అయింది. ఇప్పుడు ఉమైర్ సెలీనా పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తండ్రీ కొడుకులతో చాలాసార్లు పక్కపంచుకున్న ఏకైక బాలీవుడ్ నటి సెలీనా జెట్లీ అని ట్వీట్ చేశాడు. దీంతో ఆమె అగ్గి మీద గుగ్గిలం అయ్యి ఉమైర్కు కౌంటర్ విసిరింది.
మిస్టర్ సంధూ.. మీరు మనిషిగా మారడానికి అవసరమైన నాడా దాని పొడవు కలిగి ఉన్నారా ? మీరు అంగస్తంభన సమస్య నుండి బయట పడాలంటూ ఘాటైన పదజాలంతో ఆమె కౌంటర్ వేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా మంది సెలీనాకు మద్దతుగా నిలుస్తూ ఉమైర్ ఓ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అంటూ విరుచుకుపడుతున్నారు. ఉమైర్ ఇటీవల సినీ సెలబ్రిటీలపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే.