బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియన్ సినిమాను ఒక్క ఊపు ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత టాలీవుడ్లో కుడా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పలు సినిమాలు చేసింది. కత్రినా ముందుగా టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లేశ్వరి సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలకృష్ణకు జంటగా అల్లరి పిడుగు సినిమాలో కూడా నటించింది.
దాదాపు రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తనదైన రీతిలో నటించిన కత్రినా.. గత సంవత్సరం తన ప్రియుడు, నటుడు అయిన విక్కీ కౌశల్ను పెళ్లి చేసుకుంది. కౌశల్ వయస్సులో కత్రినా కంటే యేడాదికి పైగా చిన్నోడు కావడం మరో విశేషం. తెలుగులో విక్టరీ వెంకటేష్కు జంటగా మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్గా చేసినప్పుడు ఆ సినిమా నిర్మాత సురేష్ బాబు కత్రీనా కైఫ్కి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట.
అయినా కూడా ఆమె రెమ్యూనరేషన్ మరింత ఎక్కువగా ఇవ్వాలని.. అంతేకాకుండా తనతో పాటు వచ్చే సిబ్బందికి కూడా అదనపు సౌకర్యాలు ఇవ్వాలనే కండిషన్ కూడా పెట్టిందట. ఇవన్నీ ఆ సినిమా నిర్మాతలకు చెప్పడంతో.. వారు వాటిపై స్పందించలేదట. దీంతో కత్రినా షూటింగ్కు సరిగ్గా రాకుండా.. వచ్చిన హీరోతో సరిగ్గా నటించకుండా హీరో వెంకటేష్ కే చుక్కలు చూపించిందట.
కత్రినా తీరుతో వెంకటేష్ కూడా ఒకానొక దశలో విసిగిపోయాడట. ఇక ఆ సమయంలోనే ఆమెపై కోపంతో వెంకటేష్ చర్యలు తీసుకోవాలని నిర్మాత మండలిలో ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధపడ్డారట? అదే సమయంలో సీనియర్ నిర్మాత అశ్విని దత్ కలగజేసుకుని.. వెంకీకి సర్ది చెప్పి ఏదోవిధంగా కత్రినాతో షూటింగ్ను ముగించారట. ఈ కారణం గానే మల్లీశ్వరి మంచి విజయం సాధించనా కత్రినాకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాలేదన్న టాక్ కూడా ఉంది.