ప్రేమ‌మంట‌లు పుట్టించిన శోభిత‌.. చైతుపై ఎట్ట‌కేల‌కు మ‌న‌సులో మాట చెప్పిందిగా…!

శోభిత దూళిపాళ గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే ఈ ముద్దుగుమ్మకి, అక్కినేని నాగచైతన్యకి మధ్య ఎఫైర్ నడుస్తూ ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ అక్కినేని వారి ఇంట కోడలుగా అడుగుపెట్టనుందని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటికీ కారణం వీరిద్దరూ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో కలిసి దిగిన ఫొటో అని చెప్పవచ్చు.

నిజానికి తెలుగు అమ్మాయి అయినా శోభిత సమంత కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తుంది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ఈ తార అందాల ఆరబోతతో రెచ్చిపోతుంటుంది. పొన్నియిన్ సెల్వన్ మూవీ సిరీస్ తో శోభిత పాన్ ఇండియా నటిగా మారింది. మలయాళం, తమిళ ఇండస్ట్రీలలో కూడా ఈ ముద్దుగుమ్మ అడుగు పెట్టింది. అయితే ఏ సినిమా ఇతర పరిశ్రమకి వెళ్లినా శోభిత, నాగచైతన్యల మధ్య ఏముంది? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

వీటన్నిటి మధ్య శోభిత నాగచైతన్య గురించి ఎట్టకేలకు పెదవి విప్పింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బోల్డ్ బ్యూటీ చైతూ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. యాంకర్ “నాగ చైతన్య గురించి మీరేం చెప్తారు?” అని ప్రశ్నించగా దానికి సమాధానం ఇస్తూ చైతు చాలా మర్యాదస్తుడని, హుందాగా ఉంటాడని అతనిపై పొగడ్తల వర్షం కురిపించింది. చైతు అంత కూల్ గా ఎవరూ ఉండరని, ఆ లక్షణమే తనకు ఎంతో నచ్చుతుందని ఈ ముద్దుగుమ్మ తెలిపింది.

సమంత గురించి కూడా శోభిత మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో రాజ్యలక్ష్మి పాత్రకు సమంతా తప్ప మిగతా వారెవరూ కూడా 100% న్యాయం చేయలేరని పేర్కొంది. సమంత చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుందని, అందుకే ఆమె కెరీర్ గొప్పగా సాగుతోందని శోభిత కామెంట్స్ చేసింది. అయితే చైతూ, శోభిత డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తుండగా ఆమె ఇలాంటి హాట్ కామెంట్స్ చేయడం చర్చినీయాంశంగా మారింది. వీరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందా అనే అనుమానాలు కూడా బలపడ్డాయి.