ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. ఇండస్ట్రీలో రాణించడానికి అందం, అభినయం, తెలివితేటలతో పాటు కొంచెం ధైర్యం కూడా కావాలి. ఇండస్ట్రీలోకి మనం అడుగు పెడుతున్నాం అంటే ఆ రంగంలో వచ్చే పుకార్లను మనం ఎదుర్కోగల ధైర్యం ఉండాలి. ఏ హీరో అయినా హీరోయిన్ అయినా కాస్త స్టార్ డం వచ్చిందంటే.. వారి పైన పుకార్లు రావడం చాలా కామన్. ఒక హీరోయిన్, హీరో కాస్త క్లోజ్ గా ఉన్నారంటే వారి పైన చాలా పుకార్లు వస్తూ ఉంటాయి. అది ఇప్పటి కాలంలోనే కాదు సీనియర్ ఎన్టీఆర్ టైంలో కూడా జరిగేది.
సీనియర్ ఎన్టీఆర్ పుకార్లు రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నించేవారు. ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయనపై కూడా పుకార్లు ఆగలేదు. సీనియర్ ఎన్టీఆర్ – సావిత్రి కాంబినేషన్లో ఎన్నో సినిమాల్లో నటించారు. వారిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఎన్టీఆర్ సినిమా రంగంలోనికి అడుగుపెట్టిన కొద్ది సంవత్సరాల్లోనే స్టార్ డం సంపాదించుకున్నారు. దీంతోపాటు సావిత్రికి, ఎన్టీఆర్ కు మధ్య ఏదో సంబంధం ఉందని పుకార్లు రేగాయి.
ఎన్టీఆర్ అవి పుకార్లని వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ లక్ష రూపాయల పెట్టి మరి చెన్నైలో ఇల్లు కొని తన భార్య బసవతారకాన్ని తీసుకువచ్చి అక్కడే కాపురం పెట్టారు. సాధారణంగా హంగు ఆర్భాటం అంటే ఇష్టం లేని ఎన్టీఆర్ తన గృహప్రవేశాన్ని మాత్రం చాలా అట్టహాసంగా జరిపించారు. సావిత్రి, ఎన్టీఆర్ గురించి రాసిన తమిళ పత్రికల అధినేతలను, అలాగే సావిత్రిని, తన కుటుంబ సభ్యులను అందరిని గృహప్రవేశానికి పిలిచి చాలా ఘనంగా గృహ ప్రవేశం చేశారు.
అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ పత్రిక అధినేతల అందరి సమక్షంలో సావిత్రి నేను కలిసి ఎన్నో సినిమాల్లో నటించాము.. మా ఇద్దరికీ ఎంతో మంచి అనుబంధంగా ఉంది. సావిత్రి నాకు ఒక సోదరి లాంటిది. మా ఇంటి గృహప్రవేశానికి కూడా తానే పాలు పొంగించింది అంటూ చెప్పుకొచ్చారు. దాంతో అప్పటినుంచి ఎన్టీఆర్ – సావిత్రి పుకార్ల కు ఫుల్ స్టాప్ పడింది.