సింధూరం సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సంఘవి. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. సంఘవి తెలుగుతో పాటూ తమిళ, మలయాళ చిత్రాలలో నటించి అభిమానులను సంపాదించుకుంది. గ్లామర్స్ రోల్స్ లో నటించకుండా సంఘవి పద్దతైన పాత్రలలోనే నటిస్తూ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా నటి సంఘవి ఒకప్పటి హీరో పృథ్వీతో కలిసి సుమ అడ్డా షో లో సందడి చేసింది. ఈ షో ప్రోమో తాజాగా విడుదల చేశారు.
కాగా షో లో పృథ్వీ పై సంఘవి పంచ్ ల వర్షం కురిపించింది. అంతే కాకుండా వీరిద్దరూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుమ పృథ్వీరాజ్ తో మీ తలకు చాక్ పౌడర్ ఉంది అంటూ కామెంట్ చేసింది. దాంతో పృథ్వీరాజ్ తుడవండి తుడవండని అన్నాడు. ఆ తరవాత సుమ అందరూ డై తలకు వేసుకుంటే నేను అన్నంలో కలుపుకుని తింటాను అంటూ జోక్ వేసింది.
అంతే కాకుండా నాకు అన్ని సిటీలలో రామోజీ ఫిల్మ్ సిటీ ఇష్టమంటూ సుమ చెప్పుకొచ్చింది. ఆ తరవాత పృథ్వీతో తనకు జరిగిన ఓ అనుభవాన్ని చెబుతూ సంఘవి ఓ రోజు రాత్రి షూటింగ్ పూర్తిచేసుకుని వస్తుండగా పృథ్వీ రాజ్ తనతో తన భార్య ప్రెగ్నెంట్ అని కేక్ కావాలని అడుగుతుంటే వీళ్లు ఇవ్వడం లేదని అన్నాడని చెప్పారు. దాంతో తాను వెంటనే రెస్టారెంట్ కు వెళ్లి కేక్ తెచ్చానని సంఘవి అన్నారు.
అయితే ఆ తరవాత ఓసారి ఎయిర్ పోర్ట్ లో పృథ్వీరాజ్ భార్య కనిపించడంతో హౌమెనీ మంత్స్ అని అడిగానని అన్నారు. కానీ ఆయన భార్య షాక్ అయ్యారని ఆమె ప్రెగ్నెంట్ కాదని అన్నారు. పృథ్వీ తన భార్య ప్రెగ్రెంట్ అంటూ దారుణంగా మోసం చేశారని అన్నారు. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ రీసెంట్ గా ఓ యువతితో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల యువతితో పృథ్వీ డేటింగ్ లో ఉన్నాడని భార్యతో విడిపోయాడని వార్తలు వినిపించాయి.