టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ రాజకీయాల దెబ్బతో హీరోల కెరీర్ ఇబ్బందుల్లో పడుతోంది. సంక్రాంతికి బాలయ్య, చిరంజీవి సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేయాలని.. ఓ డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయించేలా చేయాలని పెద్ద పెద్ద రాజకీయాలే జరిగాయి. చివరకు తీవ్రమైన ఒత్తిళ్ల నేపథ్యంలో చిరు, బాలయ్య సినిమాలకు బాగానే థియేటర్లు పడ్డాయి.
ఇక ఇప్పుడు ఈ రాజకీయం దెబ్బతో అఖిల్ ఏజెండ్ ఇబ్బందుల్లో పడింది. అసలే అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా సరైన హిట్ లేదు. ఇక ఏజెంట్ మూడేళ్లుగా చెక్కుతున్నారు. బడ్జెట్ ఓవర్. ఈ సినిమాను హోల్ సేల్గా ఓ బయ్యర్ కొన్నాడు. ఇది నచ్చని కొందరు డిస్ట్రిబ్యూషన్ పెద్దలు తెరవెనక రాజకీయం మొదలు పెట్టేశారని అంటున్నారు.
హోల్సేల్గా కొన్న బయ్యర్ ఆంధ్రాలో ఏరియాల వారీగా రైట్స్ అమ్మేశాడు. ఏజెంట్కు ముందు వారం సాయితేజ్ విరూపాక్ష రిలీజ్… ఇక ఏజెంట్ రోజునే పీఎస్ 2 కూడా రిలీజ్ అవుతోంది. అయినా ఏజెంట్కు థియేటర్ల ఇబ్బంది ఉండదు. అయితే ఏజెంట్ను తొక్కేయాలనే నైజాంలో మంచి, టాప్ థియేటర్లు అన్నీ పీఎస్ 2కు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే పిఎస్ 2 కు చాలా అంటే చాలా థియేటర్ల అగ్రిమెంట్లు పూర్తయిపోయాయని టాక్ ?
కేవలం నైజాంలో ఇప్పటికే ఉన్న బయ్యర్లు అందరూ ఏకమై.. ఇక్కడ మరో బయ్యర్ రాకూడదని… ఈ హోల్ సేల్ అమ్మకాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే కుట్రతోనే ఏజెంట్కు థియేటర్లు రాకుండా చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ఈ రోజు వచ్చే ట్రైలర్ అదిరిపోయిందన్న టాక్ తెచ్చుకుంటే ఈ కుట్రలు అన్నీ పటాపంచలు అయిపోతాయి.