వీళ్లు ఇచ్చిన షాక్‌తో జ‌గ‌న్ మ‌ళ్లీ ఆ మాట అనే సాహ‌సం చేయట్లేదా…!

ఇటీవల వైసీపీకి కాస్త రివర్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం అధికార బలంతో వైసీపీ సత్తా చాటుతూ వచ్చింది..కానీ ఇప్పుడు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం…గెలిచేస్తామని అనుకున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు ఓడిపోవడం, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేయడం..ఈ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఇక వైసీపీ ట్రెండ్ ముగిసినట్లే కనిపిస్తుంది.

YSRCP May Become Like Congress: YCP MLA Anam Ram Narayan Reddy

ఇలాంటి తరుణంలోనే జగన్ మరొకసారి వర్క్ షాప్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వర్క్ షాప్ పెట్టి..గడపగడపకు వెళ్ళే అంశంపై ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా తిరగని వారికి జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చారు..అదే పంథాలో వెళితే వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని జగన్ చెబుతూ వచ్చారు. ఈ సీటు విషయంలో కొందరు ఎమ్మెల్యేలకు పరోక్షంగా కూడా క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు జరిగే వర్క్ షాపులో సైతం జగన్ ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంపై జగన్ సీరియస్ గా ఉన్నారని, అలాగే కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ఆయన సంతృప్తిగా లేరని, అలాంటి వారికి జగన్ సీటు ఇవ్వనని కూడా చెప్పేస్తారని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ అంశంలో జగన్ ఈ సారి రిస్క్ చేయరని తెలుస్తోంది. ఎమ్మెల్యేల సీటు విషయం అప్పుడే తేల్చరని గట్టిగా చెప్పవచ్చు.

ఎందుకంటే అలా తేల్చడం వల్లే..టికెట్ రాదని తెలిసి ఇద్దరు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ వేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నెక్స్ట్ సీటు లేదని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. అలాగే వారి నియోజకవర్గాల్లో అదనపు సమన్వయకర్తలని నియమించారు. దీంతో వారికి సీటు రాదని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే వారు సీటు రాదని తెలిసి వైసీపీకి షాక్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు జగన్ మళ్ళీ ఆ రిస్క్ చేయడం కష్టమే.. టికెట్ ఇవ్వనని ఎమ్మెల్యేలకు చెప్పే ధైర్యం చేయరనే చెప్పవచ్చు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp