టాలీవుడ్లోకి ఛార్మీ ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 2002లో దీపక్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన నీతోడు కావాలి సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయ్యింది. అసలు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత ఛార్మీకి వరుసగా అవకాశాలు స్టార్ట్ అయ్యాయి.
వరుసగా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అసలు పదేళ్ల పాటు ఛార్మీ టాలీవుడ్ను తిప్పేసింది. నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల నుంచి ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోల పక్కన కూడా ఆమె నటించింది. అయితే ఇప్పుడు ఛార్మీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటుతోంది. తాజాగా ఆమె తన 35వ బర్త్ డే కూడా జరుపుకుంది.
ఛార్మీ చాలా చిన్నప్పుడు అంటే కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇప్పుడు ఛార్మీ పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. అయితే ఇన్నేళ్ల కెరీర్లో ఛార్మీపై ప్రేమలు, ఎఫైర్లు, డేటింగులు అన్న రూమర్లు పిచ్చిపిచ్చిగానే వచ్చాయి. వాస్తవ, అవాస్తవాలు ఏంటో తెలియదు కాని వార్తలు చాలానే ఉన్నాయి.
ముందుగా ఆమె కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువుగా నటించింది. అప్పుడు వారిద్దరి మధ్య వార్తలు వచ్చాయి. తర్వాత లారెన్స్ సినిమాల్లో చేసినప్పుడు ఈ రూమర్లు తప్పలేదు. ఇక పూరి జగన్నాథ్ – ఛార్మీ ఎఫైర్ వార్తలకు లెక్కేలేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్తో కూడా ఛార్మీ డేటింగ్ చేస్తోందని వారిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇన్నేళ్ల వయస్సు వచ్చినా పూరితోనే ఉంటున్నా ఛార్మీ మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో ? ఈ రూమర్లకు ఎప్పుడు చెక్ పడుతుందో ? చూడాలి.