మనదేశంలో యువత రోజుకు మితిమీరి ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా వెస్ట్రన్ కల్చర్ మాయలో.. మోజులో పడి పిచ్చి పిచ్చి పనులు, పిచ్చిపిచ్చి చేష్టలతో పెడదోవ పడుతుంది. అసలు భారతదేశ గౌరవం అంటేనే వస్త్రధారణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం. మన దేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది మన వస్త్రధారణ. అయితే ఇటీవల మనదేశంలో యువతీ, యువకులు కూడా ఎక్కువగా చిట్టిపొట్టి దుస్తులు వేసుకుంటూ ఫ్యాషన్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఇది మరీ మితిమీరిపోతుంది.
ముఖ్యంగా అమ్మాయిలు అయితే పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని కూడా బయట తిరుగుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కొందరు యువతులు కేవలం బ్రా, మైక్రో మినీ స్కర్ట్స్ ధరించి మెట్రో ట్రైన్ లో హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువతి వేసుకున్న డ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
ఆ యువతి కేవలం బ్రా, మైక్రో మిని స్కర్ట్ మాత్రమే వేసుకొని ఢిల్లీ మెట్రో ఎక్కింది. అసలు ఇంకా చెప్పాలంటే ఆమె కేవలం బికినీ వేసుకుందనే అనాలి. ఆమె అలాంటి వస్త్ర ధరలతో ట్రైన్లోకి రాగానే రైలులో ఉన్న వందల మంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. మరికొందరు అయితే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ యువతి సీట్లో కూర్చుని ఉన్నప్పుడు తనకు ఒక బ్యాగ్ అడ్డుపెట్టుకుంది. ఆమె లేచి వెళుతుంటే అందరూ ఆమె వైపే షాకింగ్ గా చూశారు.
అయితే ఆ యువతీ ఎందుకు అలా ? చేసింది. మరి ఇంత విచ్చలవిడిగా ఎందుకు బరితెగించింది.. అన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వీడియోలో ఉన్న అమ్మాయిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుగుతావా ? అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే ఉర్ఫీ జావేద్ నుంచి స్ఫూర్తి పొందావా అని ? కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా భారతదేశ సంస్కృతిని ఇలాంటి వాళ్ళు బ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.