పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ వినోదయ సీతం. కోలీవుడ్లో బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కోలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్గా తెరకెక్కుతుంది.
తమిళ్లో కూడా సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేసి నటించిన ఈ సినిమా అక్కడ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో సముద్రఖని దర్శకత్వంలోనే ఇక్కడ కూడా సినిమా చేస్తున్నారు. ఒరిజినల్ లో సముద్రఖని చేసిన పాత్రనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగులో చేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను పూర్తి చేసాడు.
దాదాపు 80 శాతం వరకు షూట్ పూర్తి అయినట్టు తెలుస్తుంది.. మిగిలిన షూటింగ్ కూడా శరవేగంగా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా టైటిల్ను మేకర్స్ రీలిజ్ చేసారు. ఇక సినిమాకు బ్రో అనే టైటిల్ను పెట్టారు. ఈ బ్రో అనే టైటిల్పై ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇక జూలై 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.