ఆయన చేసిన పాత్రలే ఆయన్ని రెబల్ స్టార్ ని చేశాయి. తెర మీద మాస్ హీరోగా కనిపించినా సరే ఆయన మనసు చాలా మంచింది. విభిన్నమైన కథలతో కృష్ణం రాజు చేసిన ప్రయోగాలు అన్ని ఇన్ని కావు. ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ ల తర్వాత తెలుగు సినిమా చరిత్రలో కృష్ణం రాజు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజ్ (83). ఏ.ఐ.జీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివరం తెల్లవారుజామున కృష్ణం రాజు (Krishnam Raju) తుది శ్వాస విడిచారు. కృష్ణం రాజు మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కృష్ణం రాజు మృతి పట్ల తమ సంతాపం తెలియచేశారు.
వెండితెర మీద మాస్ హీరోగా రెబల్ స్టార్ గా Krishnam Raju గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఆయన నటించడమే కాదు గీతకృష్ణ బ్యానర్ లో నిర్మాతగా సినిమాలు కూడా చేశారు. కృష్ణం రాజు మృతి పట్ల సినీ పరిశ్రమ మాత్రమే కాదు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.