తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే హీరోయిన్ల జాబితాలో విజయవాడ అమ్మాయి రంభ కూడా ఉంటుంది. రంభ అసలు పేరు విజయలక్ష్మి. అప్పట్లో ఆమె తన అందంతో పాటు తొడలు చూపించే విషయంలో.. అందాలు ఆరబోసే విషయంలో స్టార్ హీరోలకు పోటీగా డ్యాన్సులు చేయడంలో సెగలు రేపింది. ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీలీలా ఎలా అయితే ? యూత్లో సెన్సేషన్ హీరోయిన్గా మారిందో.. అప్పట్లో రంభ కూడా అంతే సెన్సేషన్. రంభ తెలుగు అమ్మాయి అయినా హిందీ, తమిళం, మలయాళ భాషలతో పాటు భోజపురి లోనూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
కెరీర్ చివరి దశలో తెలుగులో అవకాశాలు తగ్గాక ఆమె భోజ్ఫురి భాషలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస పెట్టి స్టార్ హీరోల పక్కన నటించింది. ఆ టైంలోనే ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆమెకు దక్కాయి. అసలు భోజ్పురి సినీ ప్రేక్షకులు రంభను ఒక దేవతగా ఆరాధించారు. తెలుగులో అందరు స్టార్ హీరోలతో కలిసి నటించిన రంభ ఒక్క అక్కినేని నాగార్జునతో మాత్రం నటించలేదు. నాగార్జున పక్కన రంభ నటించిన పోవటానికి ఒక ఆసక్తికరమైన కారణం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది.
రంభను ఈవీవి సత్యనారాయణ వెండితెరకు హీరోయిన్గా పరిచయం చేశారు. అందుకే ఆయన ఏ సినిమాకు డేట్లు అడిగిన వెంటనే ఇచ్చేసేది. ఈవీవీ సత్యనారాయణ నాగార్జున హీరోగా హలో బ్రదర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా రమ్యకృష్ణ, సౌందర్య నటించారు. రమ్యకృష్ణ బదులుగా దర్శకుడు ఈవీవి రంభను తీసుకున్నారట. అప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నా ఈవివి సత్యనారాయణ మీద ఉన్న గౌరవంతో ఆ సినిమాలను క్యాన్సిల్ చేసుకుని మరి హలో బ్రదర్ సినిమాకు డేట్లు ఇచ్చిందట రంభ.
అయితే చివరి నిమిషంలో నాగార్జున పట్టు పట్టి రంభను తప్పించి ఆ స్థానంలో రమ్యకృష్ణను తీసుకోవాలని సూచించారట. దీంతో నాగార్జున మాట కాదనలేక రంభకు బదులుగా రమ్యకృష్ణను తీసుకున్నారు. అయితే ఈవీవి రిక్వెస్ట్ గా అడగడంతో అదే సినిమాలో ఒక పాటలో ఆమె కనిపించింది. ఆ తర్వాత నాగార్జునతో తాను సినిమాలు చేయకూడదని రంభ స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుందని.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటారు.